NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Uttarpradesh: రోగి నుంచి ఒక్క రూపాయి అధికంగా వసూలు.. ఉద్యోగి సస్పెండ్ 
    తదుపరి వార్తా కథనం
    Uttarpradesh: రోగి నుంచి ఒక్క రూపాయి అధికంగా వసూలు.. ఉద్యోగి సస్పెండ్ 
    Uttarpradesh: రోగి నుంచి ఒక్క రూపాయి అధికంగా వసూలు.. ఉద్యోగి సస్పెండ్

    Uttarpradesh: రోగి నుంచి ఒక్క రూపాయి అధికంగా వసూలు.. ఉద్యోగి సస్పెండ్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 18, 2024
    09:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని మహారాజ్‌గంజ్ జిల్లా, జగదౌర్ గ్రామంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఓ రోగి నుంచి అదనంగా రూ.1 వసూలు చేశాడన్నఆరోపణలపై ఒక కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల నుంచి ప్రభుత్వం తొలగించింది.

    ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారు అనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో, సివ్వా ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ప్రేమ్ సాగర్ పటేల్ సోమవారం జగదౌర్ గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

    తనిఖీల సమయంలో, ఓ రోగి ఫార్మసిస్ట్ తన వద్ద నుంచి రూ.1 అదనంగా వసూలు చేశాడని ఎమ్మెల్యే పటేల్‌కు ఫిర్యాదు చేశాడు.

    ఈ ఫిర్యాదుతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసి,ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

    వివరాలు 

    రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 

    వెంటనే జిల్లా వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి,సదరు కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు.

    ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తాయి.అక్కడ రోగులకు మందులు రూ.1కే ఇవ్వబడతాయి.

    అయితే, సదరు కాంట్రాక్ట్ ఉద్యోగి రోగి నుంచి రూ.2 వసూలు చేశాడు. తనిఖీల సమయంలో,బీజేపీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ పటేల్ ఆసుపత్రిలోని రోగులతో మాట్లాడారు.

    ఆసుపత్రిలో ప్రసూతి కేంద్రంలో రాత్రివేళల్లో మహిళా వైద్యులు అందుబాటులో లేకపోవడం, వైద్యులు రాసిన మందులు బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉందని రోగులు, వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు.

    ఈ అంశాలను జిల్లా వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే పటేల్ తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే! నో కాస్ట్ ఈఎంఐ
    IPL 2025: మాకు అన్యాయం జరిగింది... ఐపీఎల్ అధికారులపై మండిపడ్డ కోల్‌కతా ఐపీఎల్
    Bengaluru: బెంగళూరులో దారుణం.. సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం లభ్యం.. బెంగళూరు

    ఉత్తర్‌ప్రదేశ్

    cyber thugs: ఉత్తర్‌ప్రదేశ్ లో 120 కోట్ల మోసానికి యత్నం.. 7గురి అరెస్ట్  భారతదేశం
    prayagraj: ప్రయాగ్‌రాజ్‌లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఢిల్లీ-హౌరా మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం రైలు ప్రమాదం
    Uttarpradesh: యూపీలో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో 23 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా 27 మంది మృతి  భారతదేశం
    Bhole Baba: హత్రాస్ తొక్కిసలాటలో 116 మందికి పైగా మృతి.. ఘటన తర్వాత భోలే బాబా పరార్..   భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025