NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Oxfam report: దేశంలో కేవలం 1% ధనవంతుల చేతిలో 40శాతం సంపద
    తదుపరి వార్తా కథనం
    Oxfam report: దేశంలో కేవలం 1% ధనవంతుల చేతిలో 40శాతం సంపద
    అదానిపై వన్-టైమ్ పన్ను విధిస్తే 50లక్షల మంది టీచర్లకు జీతాలు

    Oxfam report: దేశంలో కేవలం 1% ధనవంతుల చేతిలో 40శాతం సంపద

    వ్రాసిన వారు Stalin
    Jan 16, 2023
    06:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలోని ఆర్థిక అసమానతలపై అంతర్జాతీయ సంస్థ ఆక్స్‌ఫామ్ తన 'సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్' నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. 40శాతం సంపద కేవలం 1% ధనవంతుల చేతిలోనే ఉన్నట్లు పేర్కొంది.

    పేదల్లో సగం మంది వద్ద కేవలం 3శాతం సంపద ఉన్నట్లు వివరించింది. దావోస్‌లో 'ప్రపంచ ఆర్ధిక వేదిక' వార్షిక సమావేశం నేపథ్యంలో ఆక్స్‌ఫామ్ ఈనివేదికను విడుదల చేసింది.

    టాప్-10 ధనవంతులపై 5% పన్ను విధించడం వల్ల బడి మానేసిన పిల్లలందరికి విద్యను అందించడానికి డబ్బు సమకూరుతుందని పేర్కొంది.

    గౌతమ్ అదానీ 2017-21 మధ్య పెరిగిన లాభాలపై వన్-టైమ్ పన్ను విధించడం వల్ల రూ.1.79 లక్షల కోట్లను సమీకరించుకోవచ్చని, దీనిద్వారా ఏడాదిపాటు 50లక్షల మంది ప్రాథమిక ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వొచ్చని చెప్పింది.

    ఆక్స్‌ఫామ్

    100 మంది ధనవంతుల సంపదతో 18నెలల కేంద్ర బడ్జెట్

    భారతదేశంలోని బిలియనీర్లు వారి మొత్తం ఆస్తులపై ఒక్కసారి మాత్రమే 2% పన్ను విధించినట్లయితే రూ.40,423 కోట్లు సమకూరుతుందని, దీని ద్వారా రాబోయే మూడేళ్లలో దేశంలోని పిల్లలకు పోషకాహారం అందించవచ్చని ఆక్స్‌ఫామ్ నివేదిక చెప్పింది.

    దేశంలోని టాప్ 10 బిలియనీర్లపై ఒక్కసారిగా 5% పన్ను విధించడం వల్ల రూ. 1.37 లక్షల కోట్లు సమకూరుతుందని, ఈ మొత్తం 2022-2023లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ అంచనా వేసిన నిధుల కంటే 1.5 రెట్లు ఎక్కువని ఆక్స్‌ఫామ్ తెలిపింది.

    దేశంలోని 100 మంది ధనవంతుల సంపదతో 18నెలల కేంద్ర బడ్జెట్ ను సమకూర్చవచ్చని ఆక్స్‌ఫామ్ పేర్కొంది. ఈ వందమంది వద్ద దాదాపు రూ. 54లక్షల కోట్ల సంపద ఉన్నట్లు స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    భారతదేశం

    ఆటో ఎక్స్‌పో 2023లో లాంచ్ కాబోతున్న MBP C1002V క్రూయిజర్ మోటార్‌సైకిల్ ఆటో మొబైల్
    బీసీసీఐ కార్యదర్శిపై పీసీబీ ఛీఫ్ సెటైర్లు క్రికెట్
    మారుతీ సుజుకి గ్రాండ్ విటారా S-CNG ధర రూ. 12.85 లక్షలు ఆటో మొబైల్
    కాబోయే తండ్రులకు కూడా 12 వారాల సెలవు ప్రవేశపెట్టిన ఫైజర్ ఇండియా టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025