NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Oxfam report: దేశంలో కేవలం 1% ధనవంతుల చేతిలో 40శాతం సంపద
    భారతదేశం

    Oxfam report: దేశంలో కేవలం 1% ధనవంతుల చేతిలో 40శాతం సంపద

    Oxfam report: దేశంలో కేవలం 1% ధనవంతుల చేతిలో 40శాతం సంపద
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 16, 2023, 06:43 pm 1 నిమి చదవండి
    Oxfam report: దేశంలో కేవలం 1% ధనవంతుల చేతిలో 40శాతం సంపద
    అదానిపై వన్-టైమ్ పన్ను విధిస్తే 50లక్షల మంది టీచర్లకు జీతాలు

    దేశంలోని ఆర్థిక అసమానతలపై అంతర్జాతీయ సంస్థ ఆక్స్‌ఫామ్ తన 'సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్' నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. 40శాతం సంపద కేవలం 1% ధనవంతుల చేతిలోనే ఉన్నట్లు పేర్కొంది. పేదల్లో సగం మంది వద్ద కేవలం 3శాతం సంపద ఉన్నట్లు వివరించింది. దావోస్‌లో 'ప్రపంచ ఆర్ధిక వేదిక' వార్షిక సమావేశం నేపథ్యంలో ఆక్స్‌ఫామ్ ఈనివేదికను విడుదల చేసింది. టాప్-10 ధనవంతులపై 5% పన్ను విధించడం వల్ల బడి మానేసిన పిల్లలందరికి విద్యను అందించడానికి డబ్బు సమకూరుతుందని పేర్కొంది. గౌతమ్ అదానీ 2017-21 మధ్య పెరిగిన లాభాలపై వన్-టైమ్ పన్ను విధించడం వల్ల రూ.1.79 లక్షల కోట్లను సమీకరించుకోవచ్చని, దీనిద్వారా ఏడాదిపాటు 50లక్షల మంది ప్రాథమిక ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వొచ్చని చెప్పింది.

    100 మంది ధనవంతుల సంపదతో 18నెలల కేంద్ర బడ్జెట్

    భారతదేశంలోని బిలియనీర్లు వారి మొత్తం ఆస్తులపై ఒక్కసారి మాత్రమే 2% పన్ను విధించినట్లయితే రూ.40,423 కోట్లు సమకూరుతుందని, దీని ద్వారా రాబోయే మూడేళ్లలో దేశంలోని పిల్లలకు పోషకాహారం అందించవచ్చని ఆక్స్‌ఫామ్ నివేదిక చెప్పింది. దేశంలోని టాప్ 10 బిలియనీర్లపై ఒక్కసారిగా 5% పన్ను విధించడం వల్ల రూ. 1.37 లక్షల కోట్లు సమకూరుతుందని, ఈ మొత్తం 2022-2023లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ అంచనా వేసిన నిధుల కంటే 1.5 రెట్లు ఎక్కువని ఆక్స్‌ఫామ్ తెలిపింది. దేశంలోని 100 మంది ధనవంతుల సంపదతో 18నెలల కేంద్ర బడ్జెట్ ను సమకూర్చవచ్చని ఆక్స్‌ఫామ్ పేర్కొంది. ఈ వందమంది వద్ద దాదాపు రూ. 54లక్షల కోట్ల సంపద ఉన్నట్లు స్పష్టం చేసింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    భారతదేశం

    తాజా

    ఇండిగో: హైదరాబాద్‌లో గాల్లో ఉన్న విమానంపై వడగళ్ల వాన; తప్పిన పెను ప్రమాదం హైదరాబాద్
    మార్చి 21న లాంచ్ కానున్న కొత్త హ్యుందాయ్ వెర్నా ఆటో మొబైల్
    భారతదేశంలో పోయిన లేదా దొంగిలించిన ఫోన్‌లను కనుగొనడానికి సహాయం చేస్తున్న ప్రభుత్వం ప్రభుత్వం
    భారతదేశంలో లాంచ్ అయిన 2023 టయోటా ఇన్నోవా క్రిస్టా ఆటో మొబైల్

    భారతదేశం

    రెండు కీలక ఒప్పందాలపై జపాన్-భారత్ సంతకాలు; ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలుపై ఒప్పందం జపాన్
    భారత్‌లోని విదేశీ రాయబారులకు కేంద్రమంత్రి హోదా; ఇతర దేశాల్లో మన హైకమిషన్లపై ఎందుకంత నిర్లక్ష్యం! దిల్లీ
    లండన్‌లో ఖలిస్థానీ మద్దతుదారుల వీరంగం; త్రివర్ణ పతాకాన్ని అగౌరవపర్చేందుకు విఫలయత్నం బ్రిటన్
    'ADV' మ్యాక్సీ-స్కూటర్ సిరీస్ ని భారతదేశంలొ ప్రవేశపెట్టనున్న హోండా ఆటో మొబైల్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023