Milad-un-Nabi: ఏపీలో మిలాద్ ఉన్ నబీ సెలవులో మార్పు.. 25కు బదులు 26న సెలవు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిలాద్ ఉన్ నబీ పబ్లిక్ హాలిడే తేదీని మార్చింది. ముందుగా ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 25న సెలవు ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ సెలవును ఆగస్టు 25 (మంగళవారం) నుంచి ఆగస్టు 26 (బుధవారం)కు మార్చుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈవో చేసిన విజ్ఞప్తి మేరకు సెలవు తేదీలో ఈ మార్పు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఉద్యోగులు, ప్రజలు గమనించాలని అధికారులు సూచించారు.
వివరాలు
తెలంగాణలోనూ ఇదే మార్పు..
మిలాద్ ఉన్ నబీ సెలవు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికే మార్పు చేసింది.
అక్కడ కూడా ముందుగా ఆగస్టు 25న ఇవ్వాల్సిన సెలవును ఆగస్టు 26కు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
వివరాలు
మిలాద్ ఉన్ నబీ ప్రాముఖ్యత ఏమిటంటే..
మిలాద్ ఉన్ నబీ లేదా ఈద్-ఏ-మిలాద్ను ఇస్లాం మత స్థాపకుడైన ముహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకుంటారు.
అరబిక్ భాషలో 'మౌలిద్' లేదా 'మిలాద్' అంటే జన్మదినం అని, 'నబి' అంటే ప్రవక్త అని అర్థం.
ఇస్లామిక్ క్యాలెండర్లోని మూడో నెల అయిన రబీ-ఉల్-అవ్వల్లో మిలాద్ ఉన్ నబీ పండుగ వస్తుంది.
ఈ సందర్భంగా ముస్లింలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా పేదలు, అవసరంలో ఉన్నవారికి అన్నదానం చేయడంతో పాటు దుస్తులు పంపిణీ చేస్తుంటారు.
వివరాలు
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఏపీలో సెలవు
మరోవైపు ఆంధ్రప్రదేశ్లో వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఈ నెల 28వ తేదీ శుక్రవారం సెలవు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు ఈ సెలవు వర్తిస్తుంది.
ఆగస్టు 30న సాధారణ సెలవు
ఆగస్టు నెలలో 30-08-2026 (ఆదివారం) సాధారణ సెలవు ఉంది. దీంతో పాటు ఉద్యోగులకు మరో ఆప్షనల్ హాలిడే కూడా అందుబాటులో ఉంది.
ఆగస్టు 28 (శుక్రవారం) శ్రావణ పూర్ణిమ (రాఖీ)ని ఆప్షనల్ హాలిడేగా పేర్కొన్నారు.
వివరాలు
సెలవుల్లో మార్పులు ఉండొచ్చు
ప్రభుత్వం, విద్యాశాఖలు సెలవులకు సంబంధించి జారీ చేసే ఉత్తర్వుల్లో అవసరాన్ని బట్టి మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది.
ప్రతి ఏడాది ప్రకటించే సాధారణ సెలవులతో పాటు స్థానికంగా నిర్వహించే వేడుకలు, వాతావరణ పరిస్థితులు, ఇతర పరిపాలనాపరమైన కారణాలను బట్టి అదనపు సెలవులు కూడా ప్రకటించవచ్చు.
ఇలాంటి మార్పులు ఏవైనా ఉంటే ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తుంది.
అందువల్ల ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు ప్రభుత్వం విడుదల చేసే తాజా అధికారిక ప్రకటనలను గమనించడం అవసరం.