
Pahalgam terror attack: పహల్గాం ఉగ్రదాడి.. కేసు NIA కి అప్పగింపు
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఆధ్వర్యంలో భారత భద్రతా బలగాలు, జమ్మూ-కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) ఆదేశాల మేరకు, ఈ కేసును జమ్మూకశ్మీర్ పోలీసులు నుండి అధికారికంగా ఎన్ఐఏ తీసుకున్నారు.
ఉగ్రదాడి జరిగిన అనంతరం, ఎన్ఐఏ బృందాలు పహల్గాంలో విచారణ ప్రారంభించాయి.
గత ఘటనలో ఉగ్రవాదులను చూసిన పర్యాటకులను పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఉగ్రవాద నిరోధక సంస్థకు చెందిన పోలీసు సూపరింటెండెంట్ పర్యవేక్షణలో విచారిస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు.
ఈ సమయంలో వారు తీసుకున్న ఫొటోలు, వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు.
Details
ఫోరెన్సిక్ బృందం సాయంతో తనిఖీలు
అలాగే పర్యాటకులు ఎవరైనా అనుమానితులను గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.
పహల్గాంలోకి ప్రవేశించే, నిష్క్రమించే ప్రాంతాల్లో ఫోరెన్సిక్ బృందం సహాయంతో తనిఖీలను ముమ్మరం చేశారు.
బైసరన్ ప్రాంతంలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు కాల్పులు జరిపిన నేపథ్యంలో, సీఆర్పీఎఫ్ (CRPF) క్విక్ యాక్షన్ టీమ్ 25 మంది కమాండోలతో సంఘటన స్థలానికి చేరుకోవడానికి 40-45 నిమిషాలు ట్రెక్కింగ్ చేసింది. వెంటనే పహల్గాం చుట్టూ సీఆర్పీఎఫ్ యూనిట్ చెక్పోస్టులు ఏర్పాటు చేసింది.
ఘటన ప్రాంతానికి సమీపంలో సురక్షిత పాయింట్లు ఏర్పాటు చేసింది. ఆ తరువాత పోలీసులు అక్కడికి చేరుకొని పర్యాటకులను ఇతర ప్రాంతాలకు తరలించారు.