NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pakistan: మరోసారి కాల్పులకు దిగిన పాకిస్తాన్.. కౌంటర్ ఇచ్చిన భారత సైనికులు..
    తదుపరి వార్తా కథనం
    Pakistan: మరోసారి కాల్పులకు దిగిన పాకిస్తాన్.. కౌంటర్ ఇచ్చిన భారత సైనికులు..
    మరోసారి కాల్పులకు దిగిన పాకిస్తాన్.. కౌంటర్ ఇచ్చిన భారత సైనికులు..

    Pakistan: మరోసారి కాల్పులకు దిగిన పాకిస్తాన్.. కౌంటర్ ఇచ్చిన భారత సైనికులు..

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 05, 2025
    09:14 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

    ఈ దాడికి తగిన ప్రతీకారం తీసుకుంటామని భారత ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.

    ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఎల్ఓసీ ప్రాంతంలో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.

    కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ నిరంతరం ఉల్లంఘిస్తూ వస్తోంది. గత 11 రోజులుగా నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం నిరంతర కాల్పులకు తెగపడుతోంది.

    మే 4వ తేదీ రాత్రి పాక్ ఆర్మీ జమ్ము కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో కాల్పులకు పాల్పడింది.

    ఈ కాల్పులు కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి, మెంధార్, నౌషేరా, సుందర్‌బాని, అఖ్నూర్ ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి.

    ఈ చర్యలపై అప్రమత్తమైన భారత ఆర్మీ సమర్థవంతంగా ప్రతిస్పందించి, పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టింది.

    వివరాలు 

    పాక్ పై భారత ప్రభుత్వం పలు ఆంక్షలు

    అలాగే, ఏప్రిల్ 22న పహల్గామ్ ప్రాంతంలోని బైసారన్ లోయలో టూరిస్టులపై ఉగ్రవాదులు విచక్షణలేని కాల్పులకు దిగారు.

    ఈ దారుణ ఘటనలో సుమారు 26 మంది ప్రాణాలు కోల్పోగా, అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు.

    ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదనకు, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలకు దారితీసింది.

    దాయాది దేశంగా పాక్ పై భారత ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది.

    ఇక భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఈ ఉద్రిక్తత పరిస్థితిని సమీక్షించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నేటి రోజు ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశముంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    లైన్ అఫ్ కంట్రోల్ (ఎల్ ఓ సి)

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    లైన్ అఫ్ కంట్రోల్ (ఎల్ ఓ సి)

    ఇండో చైనా సరిహద్దు వివాదాలు.. ఇరుదేశాల 19వ సారి శాంతి చర్చలు సానుకూలం భారతదేశం
    India- Pakistan: J&Kలోని నియంత్రణ రేఖ సమీపంలో పాకిస్థానీ క్వాడ్‌కాప్టర్లపై భారత సైన్యం కాల్పులు  జమ్ముకశ్మీర్
    India-Pakistan: ఎనిమిదో రోజూ అదే తీరు.. ఎల్వోసీ వెంబడి పాక్‌ కాల్పులు.. దీటుగా బదులిచ్చిన భారత్‌ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025