NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Haryana: హర్యానాలోని నుహ్‌లో పాకిస్తాన్ 'గూఢచారి' నెట్‌వర్క్ గుట్టురట్టు.. రెండు రోజుల్లో రెండో అరెస్టు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Haryana: హర్యానాలోని నుహ్‌లో పాకిస్తాన్ 'గూఢచారి' నెట్‌వర్క్ గుట్టురట్టు.. రెండు రోజుల్లో రెండో అరెస్టు
    హర్యానాలోని నుహ్‌లో పాకిస్తాన్ 'గూఢచారి' నెట్‌వర్క్ గుట్టురట్టు.. రెండు రోజుల్లో రెండో అరెస్టు

    Haryana: హర్యానాలోని నుహ్‌లో పాకిస్తాన్ 'గూఢచారి' నెట్‌వర్క్ గుట్టురట్టు.. రెండు రోజుల్లో రెండో అరెస్టు

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 19, 2025
    01:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్‌ కోసం గూఢచర్యం చేస్తున్న పలువురు భారతీయుల్ని అధికారులు గుర్తించి ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు.

    ఇప్పటికే హర్యానా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో దాదాపు ఎనిమిది మంది గూఢచారులను అదుపులోకి తీసుకున్నారు.

    ఈ అరెస్టులలో విద్యార్థులు,యూట్యూబర్లు,వ్యాపారవేత్తలు,భద్రతా గార్డులు వంటి వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు.

    తాజాగా మరో అనుమానితుడిని అరెస్ట్‌ చేశారు.హర్యానా రాష్ట్రంలోని నుహ్‌ ప్రాంతంలో సోమవారం రోజు అధికారులు ఓ అనుమానితుడిని పట్టుకున్నారు.

    వివరాలు 

    రజక గ్రామానికి చెందిన అర్మాన్‌ అరెస్ట్ 

    అతని పేరు మహ్మద్‌ తారీఫ్‌గా గుర్తించబడింది.ఈయన మేవాట్‌ జిల్లాలోని టౌరు తహసీల్‌కు చెందిన కంగర్కా గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు.

    తారీఫ్‌ పాక్‌ గూఢచారి సంస్థలకు భారత దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని పంపిస్తున్నాడని విచారణలో తేలింది.

    ఇదే ప్రాంతమైన నుహ్‌లో రెండు రోజుల క్రితం రజక గ్రామానికి చెందిన అర్మాన్‌ను కూడా గూఢచర్య ఆరోపణలపై అరెస్ట్‌ చేశారు.

    ఇక 'ఆపరేషన్‌ సిందూర్‌' అనంతరం దేశవ్యాప్తంగా పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలతో ఇప్పటివరకు మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

    వివరాలు 

    పాకిస్థాన్‌ ఇంటర్ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ISI) కోసం ఈ ఏడుగురూ పని చేస్తున్నారు

    అరెస్టైన వారిలో పంజాబ్‌ నుంచి గజాలా, ఉత్తరప్రదేశ్‌ నుంచి యాసీన్ మొహమ్మద్‌, నోమాన్ ఇలాహి, షహజాద్ (మొరాదాబాద్‌కి చెందినవాడు),హర్యానాలోని నుహ్‌ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల అర్మాన్, కైతాల్‌కు చెందిన 25 ఏళ్ల దేవేంద్ర సింగ్ ధిల్లాన్, జలంధర్‌కు చెందిన మహమ్మద్ ముర్తజా అలీ, యూట్యూబర్‌గా వ్యవహరిస్తున్న హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా ఉన్నారు. ఇప్పుడు నుహ్‌లోని మహ్మద్ తారీఫ్ అరెస్టుతో ఈ సంఖ్య తొమ్మిదికి చేరింది.

    ఈ ఏడుగురూ పాకిస్థాన్‌ ఇంటర్ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ISI) కోసం పని చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హర్యానా

    తాజా

    Haryana: హర్యానాలోని నుహ్‌లో పాకిస్తాన్ 'గూఢచారి' నెట్‌వర్క్ గుట్టురట్టు.. రెండు రోజుల్లో రెండో అరెస్టు హర్యానా
    Supreme Court: మాజీ న్యాయమూర్తులకు సమాన పెన్షన్ ఇవ్వాలి: సుప్రీం ఆదేశాలు  సుప్రీంకోర్టు
    Subodh Kumar Goel: యూకో బ్యాంక్‌ మాజీ సీఎండీ సుబోధ్‌ కుమార్‌ గోయల్‌ను అరెస్టు చేసిన ఈడీ  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    Indonesia: ఇండోనేషియాలోని బద్దలైన లెవోటోబి లకి-లకి పర్వతం.. 6కి.మీ వరకు బూడిద  ఇండోనేషియా

    హర్యానా

    Haryana Assembly Elections 2024: ఆప్‌కి మరో ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లో చేరిన నీలోఖేరి అభ్యర్థి  భారతదేశం
    Manu Bakar: యువతకు ఆదర్శంగా మను బాకర్.. హర్యానా ఎన్నికల్లో తొలిసారి ఓటేసిన స్టార్ షూటర్  పోలింగ్
    Congress: వేదికపైనే కాంగ్రెస్ మహిళా నేతపై వేధింపులు.. పార్టీపై తీవ్ర విమర్శలు (వీడియో) కాంగ్రెస్
    Haryana Polls 2024 : హర్యానాలో ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం - విజేత ఎవరు? భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025