NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pamban Bridge: పాంబన్ వంతెన దేశానికి అంకితం.. ప్రారంభించిన మోదీ
    తదుపరి వార్తా కథనం
    Pamban Bridge: పాంబన్ వంతెన దేశానికి అంకితం.. ప్రారంభించిన మోదీ
    పాంబన్ వంతెన దేశానికి అంకితం.. ప్రారంభించిన మోదీ

    Pamban Bridge: పాంబన్ వంతెన దేశానికి అంకితం.. ప్రారంభించిన మోదీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 06, 2025
    01:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత ప్రధాన భూభాగాన్ని రామేశ్వరంతో ఆధునిక సాంకేతికత ద్వారా కలుపుతున్న పాంబన్ వంతెన (Pamban Bridge)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు అంకితం చేశారు.

    ఇది దేశంలో నిర్మితమైన మొట్టమొదటి వర్టికల్‌ లిఫ్ట్‌ రైల్వే సముద్ర వంతెనగా నిలిచింది. ఈ వంతెన సముద్రంపై 2.08 కిలోమీటర్ల పొడవులో నిర్మించారు.

    వంతెన దిగువన ఓడల రాకపోకలకు అనువుగా ఓ కీలకమైన వర్టికల్‌ లిఫ్ట్‌ సౌకర్యం ఏర్పాటు చేశారు.

    తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్ల వ్యయంతో ఈ వంతెనను నిర్మించారు.

    2019 మార్చి 1న ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా, 2020లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్‌(RVNL) నిర్మాణ పనులను ప్రారంభించి, నాలుగు సంవత్సరాల్లో విజయవంతంగా పూర్తి చేసింది.

    Details

    రూ.8,300 కోట్ల విలువైన నేషనల్‌ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన

    ఈ సందర్భంగా రామేశ్వరం - తాంబరం ప్రత్యేక రైలును కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ రైలు తాజాగా ప్రారంభమైన పాంబన్ వంతెనపై ప్రయాణం చేసింది.

    ఈ రైలులో విద్యార్థులు, ఇతర ప్రయాణికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అదే సమయంలో వంతెన కిందగా సాగిన కోస్ట్‌ గార్డ్‌ నౌకకు పచ్చజెండా ఊపి ఆత్మీయ స్వాగతం పలికారు.

    ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, తమిళనాడు ఆర్థికశాఖ మంత్రి తంగం తెన్నరసు తదితర ప్రముఖులు హాజరయ్యారు.

    అనంతరం ప్రధానమంత్రి మోదీ రూ.8,300 కోట్ల విలువైన నేషనల్‌ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం తోపాటు, పూర్తయిన పనులను ప్రారంభించనున్నారు.

    అనంతరం రామేశ్వరంలోని జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించి, ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రారంభించిన మోదీ

    Historic Moment!🚆🇮🇳

    Hon'ble Prime Minister Shri Narendra Modi flags off the first train on the iconic #NewPambanBridge marking a new era in India's railway infrastructure!@PMOIndia @narendramodi @AshwiniVaishnaw @RailMinIndia #IndianRailways #SouthernRailway pic.twitter.com/621rNFNpEq

    — Southern Railway (@GMSRailway) April 6, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    భారతదేశం

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    నరేంద్ర మోదీ

    Modi-Pawan Kalyan: దిల్లీలో రేఖా గుప్తా ప్రమాణ స్వీకార వేడుకలో మోదీ, పవన్‌ మధ్య సరదా సంభాషణ పవన్ కళ్యాణ్
    PM Modi: ప్రతి రంగంలో కొత్త నాయకత్వం అవసరం : సోల్ లీడర్‌షిప్ కాన్‌క్లేవ్‌లో మోదీ ఇండియా
    PM Modi: మారిషస్‌ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా ప్రధాని మోదీ మారిషస్
    PM Modi: ఏఐతో భారత్ పురోగతి: మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ ఇండియా

    భారతదేశం

    GST increase: జీఎస్టీ పెంపుతో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్‌పై పెరిగిన ఒత్తిడి జీఎస్టీ
    ICAI CA Final Results: సీఏ ఫైనల్‌ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు.. ఇద్దరికీ ఫస్ట్‌ ర్యాంక్‌ భారతదేశం
    Terrorist Activities: భారత్‌లో ఉగ్రవాదానికి మద్దతు.. బంగ్లాదేశ్ జాతీయుడికి ఏడేళ్ల జైలు శిక్ష బంగ్లాదేశ్
    HMPV Virus : కర్ణాటకలో రెండు HMPV వైరస్ కేసులు.. ధృవీకరించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025