Page Loader
Merchant Navy officer: 'నాన్న డ్రమ్ములో ఉన్నాడు'.. మర్చంట్ నేవీ ఆఫీసర్ హత్యపై ఆరేళ్ళ  కుమార్తె 
'నాన్న డ్రమ్ములో ఉన్నాడు'.. మర్చంట్ నేవీ ఆఫీసర్ హత్యపై ఆరేళ్ళ కుమార్తె

Merchant Navy officer: 'నాన్న డ్రమ్ములో ఉన్నాడు'.. మర్చంట్ నేవీ ఆఫీసర్ హత్యపై ఆరేళ్ళ  కుమార్తె 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 20, 2025
12:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో చోటుచేసుకున్న ఓ ఘోరమైన ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. మర్చంట్‌ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్‌ను అతని భార్య ముస్కాన్‌ రస్తోగి తన ప్రియుడి సహాయంతో దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తాజా వివరాల ప్రకారం, ఈ హత్యను మృతుడి ఆరేళ్ల కుమార్తె కూడా చూసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన తండ్రి ఓ డ్రమ్ములో ఉన్నాడని ఆ చిన్నారి చుట్టుపక్కల వారికి చెప్పినట్లు సమాచారం.

వివరాలు 

'నాన్న డ్రమ్ములో ఉన్నాడు'

ఈ విషయాన్ని సౌరభ్‌ తల్లి రేణు దేవీ మీడియాతో పంచుకున్నారు."నా కుమారుడిని అతని భార్య ముస్కాన్‌,ఆమె ప్రియుడు మార్చి 4న హత్య చేశారు.ఆ తర్వాత ట్రిప్‌కు వెళ్లిపోయారు. తిరిగి వచ్చాక ఇంటి యజమాని ద్వారా మరమ్మతుల కోసం కూలీలను రప్పించారు. అయితే,ఇంట్లో ఉన్న పెద్ద డ్రమ్మును కూలీలు కదిలించలేకపోయారు.లోపల ఏముందనే సందేహంతో మూత తీసి చూడగా భయంకరమైన దుర్వాసన వచ్చింది.వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.అయితే, పోలీసులు అక్కడికి చేరుకునేలోపే మా కోడలు అక్కడి నుంచి తప్పించుకుంది.మా ఆరేళ్ల మనవరాలికి జరిగిన ఘోర హత్య విషయం తెలిసి ఉండొచ్చు.'నాన్న డ్రమ్ములో ఉన్నాడు' అని ఆమె పొరుగువారితో చెప్పినప్పుడల్లా ముస్కాన్‌ అనుమానం పడి బాలికను వేరే చోటుకు పంపించేసింది," అని ఆమె భావోద్వేగంగా తెలిపారు.

వివరాలు 

2016లో ప్రేమ వివాహం

డ్రమ్ము తెరిచిన రోజునే ముస్కాన్‌ తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది. అక్కడ తన తల్లిదండ్రులకు భర్తను హత్య చేసిన విషయాన్ని చెప్పింది. షాక్‌కు గురైన వారు వెంటనే ఆమెను పోలీసులకు అప్పగించారు. తమ స్వంత కుమార్తె ఇటువంటి హేయమైన చర్యకు పాల్పడిందని ఆమె తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురై, కఠినమైన శిక్ష విధించాల్సిందిగా డిమాండ్‌ చేశారు. సౌరభ్‌ (29),ముస్కాన్‌ (27)2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సౌరభ్‌ మర్చంట్‌ నేవీలో ఉద్యోగం చేసేవాడు. 2019లో వీరికి కుమార్తె జన్మించింది. కొంతకాలానికే ముస్కాన్‌ సాహిల్‌ (25)అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. సౌరభ్‌ ఉద్యోగం మానేసి లండన్‌కు వెళ్లి బేకరీలో పనిచేసేవాడు.గత నెల కుమార్తె పుట్టినరోజు కోసం అతను ఇండియాకు వచ్చాడు.

వివరాలు 

ప్రియుడి సహాయంతో హత్య

అయితే,భర్త తిరిగి రావడం ముస్కాన్‌కు నచ్చలేదు.అందుకే, ప్రియుడి సహాయంతో ఈ హత్యకు పాల్పడింది. హత్య అనంతరం, మృతదేహాన్ని 15 ముక్కలుగా నరికారు. ఆ శరీర భాగాలను ఓ పెద్ద ప్లాస్టిక్‌ డ్రమ్ములో దాచిపెట్టి, పైన సిమెంట్‌తో కప్పి ఉంచారు. విచారణలో ముస్కాన్‌, ఆమె ప్రియుడు ఘోర నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది.