LOADING...
Papikondalu Boat Services: పాపికొండల బోటు యాత్రలు బంద్.. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సర్వీసులు రద్దు!
పాపికొండల బోటు యాత్రలు బంద్.. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సర్వీసులు రద్దు!

Papikondalu Boat Services: పాపికొండల బోటు యాత్రలు బంద్.. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సర్వీసులు రద్దు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 14, 2026
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

పోలవరం జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పాపికొండలకు వెళ్లే బోటు సర్వీసులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. దేవీపట్నం మండలంలోని గండిపోశమ్మ ఆలయం నుంచి పాపికొండల వైపు నడిచే పర్యాటక బోట్లను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో విహారయాత్ర కోసం అక్కడికి చేరుకున్న పర్యాటకులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. పాపికొండల సందర్శన కోసం ముందుగానే ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి పర్యాటక శాఖ అధికారులు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. బోటు సర్వీసులు నిలిపివేయడంతో పలువురు తమ ప్రయాణ ప్రణాళికలను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వివరాలు

సర్వీసులు తత్కాలికంగా నిలిపివేత

ఇటీవల చోటుచేసుకున్న ఓ సాంకేతిక సమస్య ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఈ నెల 13వ తేదీన 89 మంది పర్యాటకులతో పాపికొండల వైపు బయలుదేరిన 'శ్రీలక్ష్మి' బోటుకు గోదావరి నదిలో ప్రయాణిస్తున్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. అనూహ్యంగా బోటు సమస్యకు గురికావడంతో అందులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు లోనై ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న కంట్రోల్ రూమ్ అధికారులు వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. అత్యవసరంగా 'జలశ్రీ' బోటును ఘటనాస్థలికి పంపించి, శ్రీలక్ష్మి బోటులో చిక్కుకున్న పర్యాటకులను సురక్షితంగా మరో బోటులోకి తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు పాపికొండల బోటు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు.

Advertisement