NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 21 అండ‌మాన్ దీవుల‌కు వీరుల పేర్లు, నేతాజీ స్మారక నమూనాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    21 అండ‌మాన్ దీవుల‌కు వీరుల పేర్లు, నేతాజీ స్మారక నమూనాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ
    నేతాజీ స్మారక నమూనాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ

    21 అండ‌మాన్ దీవుల‌కు వీరుల పేర్లు, నేతాజీ స్మారక నమూనాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Stalin
    Jan 23, 2023
    01:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అండ‌మాన్ నికోబార్ దీవుల్లోని 21 పేరు లేని దీవులకు పరమవీర చక్ర అవార్డు పొందిన 21 మంది వీరుల పేర్లను పెట్టారు ప్రధాని మోదీ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి(జనవరి 23) సందర్భంగా నిర్వహించిన 'పరాక్రమ దివస్'లో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్న ప్రధాని మోదీ ఈ పేర్లను ప్రకటించారు.

    అలాగే, సుభాష్ చంద్రబోస్ ద్వీపంలో నిర్మించనున్న నేతాజీ స్మారక నమూనాను మోదీ ఆవిష్కరించారు. అండమాన్ నికోబార్ దీవులకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను గౌరవింకుంటూ ఆ మహనీయుని స్మారకార్థంగా అండ‌మాన్ నికోబార్ దీవుల్లోని రాస్ దీవులకు 2018లో నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ ద్వీప్‌గా నామకరణం చేశారు.

    నేతాజీ

    ఈ ద్వీపాలు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి: ప్రధాని

    పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేరును పెట్టబడిన ఈ ద్వీపాలు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ పేర్లు పెట్టడం వల్ల ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగుతుందన్నారు.

    దీవులకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేరు పెట్టడం వల్ల అవి ఎప్పటికీ ఆ వీరులను గుర్తు చేస్తాయని హోంమంత్రి అమిత్ షా అన్నారు.

    పరమవీర చక్ర అవార్డు గ్రహీతలను సత్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ అధికారి చెప్పారు. 21 ద్వీపాల్లో 16 ఉత్తర, మధ్య అండమాన్ జిల్లాల్లో, ఐదు దక్షిణ అండమాన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి

    తాజా

    Google I/O 2025: గూగుల్ కొత్త ఏఐ మోడ్‌తో షాపింగ్ ఇక స్మార్ట్‌గా.. ట్రై-ఆన్, ట్రాకింగ్, తక్షణ చెల్లింపుల సౌలభ్యం! గూగుల్
    #NewsBytesExplainer: ఫేక్ ప్రామిస్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం.. చట్టం ఏం చెబుతుందంటే? న్యాయస్థానం
    Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే! నో కాస్ట్ ఈఎంఐ

    నరేంద్ర మోదీ

    ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్.. 'శాంతిలో పాలుపంచుకోండి' ఉక్రెయిన్
    ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ ప్రధాన మంత్రి
    కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా? చంద్రబాబు నాయుడు
    మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత.. మాతృమూర్తిపై ప్రధాని భావోధ్వేగ ట్వీట్ గుజరాత్

    ప్రధాన మంత్రి

    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    టార్గెట్ 2024: కేంద్ర మంత్రివర్గం, బీజేపీలో భారీ మార్పులకు మోదీ స్కెచ్ నరేంద్ర మోదీ
    వాటర్ విజన్ @ 2047: నీటి నిర్వహణపై పంచాయతీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం నరేంద్ర మోదీ
    జనవరిలోనే సికింద్రాబాద్-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కనుందా? నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025