NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఈ నెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు.. కేంద్రం ఏం చేయబోతోంది
    తదుపరి వార్తా కథనం
    ఈ నెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు.. కేంద్రం ఏం చేయబోతోంది
    ఈ నెలలోనే కీలక ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు

    ఈ నెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు.. కేంద్రం ఏం చేయబోతోంది

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 01, 2023
    11:11 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సెప్టెంబర్ 18-22 మధ్య ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలను నిర్వహించాలని గురువారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త పార్లమెంట్​లోనే స్పెషల్ సెషన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

    ఇందులో భాగంగానే యూనిఫామ్ సివిల్ కోడ్, మహిళల రిజర్వేషన్ బిల్లు,కీలక జమిలీ ఎన్నికలు (దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు) తదితర బిల్లులను ఆమోదించనున్నట్లు సమాచారం.

    కాశ్మీర్ లో ఎన్నికలకు సంబంధించి ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆ అంశంపైనా చర్చించే అవకాశం ఉంది.

    ఆర్టికల్ 370డిపైనా చర్చించనున్నట్లు అధికార వర్గాలు అంటున్నాయి.

    భారత అంతరిక్ష కేంద్రం-ఇస్రో నేతృత్వంలో చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ కావడంతో దానిపైనా చర్చలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

    G-20 శిఖరాగ్ర సమావేశాల్లో చర్చకు వచ్చిన అంశాలపై స్పెషల్ సెషన్​లో చర్చించనున్నట్లు సమాచారం.

    DETAILS

    ముందస్తు ఎన్నికలపై జోరుగా  ఊహాగానాలు

    మరోవైపు ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు విస్త్రృతం అయ్యాయి. సెప్టెంబర్​లో లోక్​సభను రద్దు చేసి నవంబర్ లేదా డిసెంబర్​లో ముందస్తుకు వెళ్లేందుకు కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

    దీనిపై విపక్ష కూటమి నేతలు పెదవి విరుస్తున్నారు. మోదీ సర్కార్ డిసెంబర్​లో ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తోందని, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బిహార్ సీఎం నితీశ్‌‌ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు.

    ఇండియా కూటమి భేటీ, అదానీ వ్యవహారాన్ని దారి మళ్లించేందుకే​ ప్రత్యేక సెషన్ అని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ విమర్శించారు.

    అదానీ ఇష్యూ పై ఇదే సెషన్​లో జేపీసీ(JOINT PARLIAMENTARY COMMITTEE) వేయాలని డిమాండ్ చేస్తామన్నారు.

    గణేష్ ఉత్సవాల సమయంలో సమావేశాలేంటని ఎంపీ ప్రియాంక ప్రశ్నించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
    ప్రహ్లాద్ జోషి

    తాజా

    Donald Trump: వలసదారులపై సుప్రీం తీర్పు అమెరికాకు ముప్పు: ట్రంప్‌ ఫైర్ డొనాల్డ్ ట్రంప్
    Rajinikanth: వివేక్ ఆత్రేయకు రజనీ కాంత్ గ్రీన్ సిగ్నల్  రజనీకాంత్
    Dry fruit lassi: పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే డ్రై ఫ్రూట్ లస్సీ ఇలా తయారు చేసుకోండి! జీవనశైలి
    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్

    పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి

    జనవరి 31నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, ఏప్రిల్ 6న ముగింపు ప్రహ్లాద్ జోషి
    Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్‌‌ను సాధించే వరకూ విశ్రమించేది లేదు: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    ఈ నెలలోనే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్న ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ బీజేపీ

    ప్రహ్లాద్ జోషి

    జులై 30 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు  పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
    సెప్టెంబర్‌లో ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025