NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / NewsBytesExplainer: పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణం.. ప్రమాదమా? హత్యా?.. రాజకీయ నాయకుల స్పందన ఇదే!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    NewsBytesExplainer: పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణం.. ప్రమాదమా? హత్యా?.. రాజకీయ నాయకుల స్పందన ఇదే!
    పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణం.. ప్రమాదమా? హత్యా?.. రాజకీయ నాయకుల స్పందన ఇదే!

    NewsBytesExplainer: పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణం.. ప్రమాదమా? హత్యా?.. రాజకీయ నాయకుల స్పందన ఇదే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 28, 2025
    04:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తూర్పు గోదావరి జిల్లా కొంతమూరు వద్ద క్రైస్తవ మత బోధకుడు పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

    రాజమండ్రి సమీపంలో జరిగిన ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిశోర్ ఈ విషయాన్ని వెల్లడించారు.

    ఘటన వివరాలు

    పగడాల ప్రవీణ్ కుమార్ మార్చి 24న హైదరాబాద్ నుంచి మోటార్ సైకిల్‌పై బయలుదేరి రాజమండ్రికి వెళ్లారు.

    రాత్రి 11.31 నిమిషాలకు కొవ్వూరు టోల్ గేట్ దాటి, 11.42 నిమిషాలకు కొంతమూరు సమీపంలోని నయారా పెట్రోల్ బంకు దగ్గర ప్రమాదానికి గురయ్యారని పోలీసులు వెల్లడించారు.

    బుల్లెట్ వాహనం అదుపుతప్పి రహదారి పక్కన లోతైన ప్రాంతంలో పడిపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు.

    Details

     క్రైస్తవ సంఘాల అనుమానాలు 

    క్రైస్తవ సంఘాలు, కుటుంబ సభ్యులు మాత్రం ఇది ప్రమాదం కాదని, పాస్టర్ ప్రవీణ్ కుమార్ హత్యకు గురయ్యారని అనుమానం వ్యక్తం చేశారు.

    రోడ్డు ప్రమాదమైతే అతని ఒంటిపై గాయాలు భిన్నంగా ఉండేవని వారు అభిప్రాయపడ్డారు.

    హెల్మెట్ పూర్తిగా సమస్తంగా ఉండటం, చొక్కాపై బూటు ముద్రలు ఉండటం అనుమానాస్పద అంశాలుగా పేర్కొన్నారు.

    సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు

    పోలీసులు సంఘటనా స్థలం సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు.

    ప్రవీణ్ కుమార్ వాహనాన్ని ఐదు వాహనాలు దాటి వెళ్లినట్లు గుర్తించారు.

    రెడ్ కలర్ కారును ప్రత్యేకంగా అనుమానితంగా పరిశీలిస్తున్నారు. - హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ప్రయాణించిన అన్ని మార్గాల్లో దర్యాప్తు చేపట్టారు.

    Details

    అనుమానాస్పద మృతిగా కేసు నమోదు 

    క్రైస్తవ సంఘాలు, కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

    ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.

    కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో, ఇద్దరు క్రైస్తవ వైద్యుల సమక్షంలో పోస్టుమార్టం చేయాలని వారు కోరగా, అధికారులు అంగీకరించారు.

    కేఏ పాల్, హర్షకుమార్ స్పందన

    ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఘటనపై అనుమానం వ్యక్తం చేశారు.

    సీసీ టీవీ ఫుటేజీ పూర్తిగా విడుదల చేసి, పోస్టుమార్టం నివేదిక పారదర్శకంగా బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

    Details

    రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తా

    ఇది ప్రమాదం కాదని ఇది హత్య అని నా వ్యక్తిగత విచారణలో తేలిందని, కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ తెలిపారు. ఈ కేసును రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లి రీ-ఇన్వెస్టిగేషన్ జరిపిస్తానని పేర్కొన్నారు.

    పోలీసుల హెచ్చరిక

    ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ కిశోర్ హెచ్చరించారు.

    Details

     మరణంపై బిషప్ ప్రతాప్ సిన్హా అనుమానాలు 

    ప్రవీణ్ కుమార్ వాహనం, హెల్మెట్, దుస్తుల పరిశీలన ఆధారంగా ఇది ప్రమాదం కాదని అనిపిస్తోంది.

    లోతైన ప్రాంతంలో పడిపోయినట్లు అయితే, వాహనం, మృతదేహం వేర్వేరు ప్రాంతాల్లో ఉండాలి. కానీ ఆ పరిస్థితి కనిపించలేదు.

    పోస్టుమార్టం నివేదిక రేపు విడుదల

    మార్చి 29న పోస్టుమార్టం నివేదిక విడుదల కానుందని వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులకు నివేదిక అందజేయనున్నారు. ఈ కేసుపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    ఆంధ్రప్రదేశ్

    Amaravati: అమరావతిలో భూకేటాయింపులు.. కీలక భేటీలో మంత్రుల కమిటీ అమరావతి
    Amaravati: అమరావతి రాజధాని నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! త్వరలో పనులు ప్రారంభం అమరావతి
    Amaravati: ఏపీ రాజధానిపై కీలక నిర్ణయం.. 13 సంస్థలకు కేబినెట్ సబ్ కమిటీ ఊహించని షాక్! అమరావతి
    Solar Power: కాలువలపై సౌరవిద్యుత్తు ఉత్పత్తికి కసరత్తు.. జలవనరులశాఖకు నిపుణుల సూచన భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025