Page Loader
Pawan Kalyan: ఈ నెల 14 నుంచి గోదావరి జిల్లాల్లో పవన్‌ కళ్యాణ్ పర్యటన 
Pawan Kalyan: ఈ నెల 14 నుంచి గోదావరి జిల్లాల్లో పవన్‌ కళ్యాణ్ పర్యటన

Pawan Kalyan: ఈ నెల 14 నుంచి గోదావరి జిల్లాల్లో పవన్‌ కళ్యాణ్ పర్యటన 

వ్రాసిన వారు Stalin
Feb 11, 2024
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 14-17 వరకు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. భీమవరంలో పర్యటన ప్రారంభం అవుతుంది. పర్యటనలో భాగంగా పార్టీ సీనియర్ నేతలు, స్థానికంగా పలుకుబడి ఉన్న నేతలు, ఇతర ముఖ్యులతో ఆయన భేటీ కానున్నారు. అలాగే, పవన్ కళ్యాణ్ తన రాజకీయ మిత్రపక్షమైన తెలుగుదేశం నాయకులతో కూడా సమావేశమవుతారు. పవన్ పర్యటన మూడు దశల్లో ఉంటుంది. మొదటి దశలో అతను ముఖ్యమైన నాయకులు, స్థానికంగా ప్రభావవంతమైన నాయకులు, ఇతర ముఖ్య వ్యక్తులతో సమావేశమవుతారు. రెండో దశలో, పార్టీ స్థానిక కమిటీల నాయకులు, క్యాడర్, మహిళలుతో భేటీ అవుతారు. మూడో దేశలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జనసేన ట్వీట్