NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Madhyapradesh: మధ్యప్రదేశ్‌'లో ఘరానా మోసం.. రూ.10 కోట్ల కుంభకోణం.. ప్యూన్‌, మరో ఐదుగురు అరెస్టు 
    తదుపరి వార్తా కథనం
    Madhyapradesh: మధ్యప్రదేశ్‌'లో ఘరానా మోసం.. రూ.10 కోట్ల కుంభకోణం.. ప్యూన్‌, మరో ఐదుగురు అరెస్టు 
    మధ్యప్రదేశ్‌'లో ఘరానా మోసం.. రూ.10 కోట్ల కుంభకోణం.. ప్యూన్‌, మరో ఐదుగురు అరెస్టు

    Madhyapradesh: మధ్యప్రదేశ్‌'లో ఘరానా మోసం.. రూ.10 కోట్ల కుంభకోణం.. ప్యూన్‌, మరో ఐదుగురు అరెస్టు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 09, 2024
    11:01 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌లో ఓ భారీ మోసం జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది.

    మధ్యప్రదేశ్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ కార్యాలయంలో ప్యూన్‌గా పనిచేస్తున్న బ్రిజేంద్రదాస్ నామ్‌దేవ్ అనే వ్యక్తి మరో ఐదుగురితో కలిసి రూ.10 కోట్ల కుంభకోణాన్ని జరిపేందుకు ప్రయత్నించాడు.

    పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం, నిందితులు మొదటగా బ్రిజేంద్రను ప్యూన్‌గా కాకుండా డ్రాయింగ్, డిస్బర్స్‌మెంట్ అధికారిగా చూపించి, బ్యాంకుల్లో పనిచేసే ఇతర నిందితుల సహాయంతో విత్తన ధ్రువీకరణ విభాగానికి సంబంధించి నకిలీ పత్రాలు, డాక్యుమెంట్లు చూపించి రూ.10 కోట్ల నగదును అతడి అకౌంట్‌లో ట్రాన్స్‌ఫర్ చేశారు.

    వివరాలు 

    నకిలీ పత్రాలు, సీళ్లు కూడా తయారు

    తరువాత, ఆ మొత్తం 50 వేర్వేరు అకౌంట్లకు బదిలీ చేసి, ఆ డబ్బుతో ప్రభుత్వానికి సంబంధించిన భూములను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు.

    వారు ఈ భూములపై ప్రాజెక్టులు ఏర్పాటు చేసి, ప్రభుత్వ జాతీయ పశుసంవర్ధక పథకాన్ని ఉపయోగించి, సబ్సిడీని పొందాలనుకున్నారు.

    నకిలీ పత్రాలు, సీళ్లు కూడా తయారుచేసి, శాఖాపరమైన ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకున్నారు.

    అయితే, వారి పథకం బయటపడడంతో ప్యూన్‌తో సహా ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

    వివరాలు 

    నకిలీ పత్రాలు, భూముల స్వాధీనం

    బ్రిజేంద్రదాస్‌ ప్రవర్తనపై విత్తన ధ్రువీకరణ అధికారి సుఖ్‌దేవ్ ప్రసాద్ అహిర్వార్‌కు అనుమానం రాగా, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

    నాలుగు నెలల క్రితం ఈ పథకాన్ని రచించినట్లు పోలీసులు తెలిపారు.

    నిందితుల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడం, వారి వద్ద ఉన్న నకిలీ పత్రాలు, భూములను స్వాధీనం చేసుకోవడం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్

    తాజా

    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్
    Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ  జమ్ముకశ్మీర్
    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌
    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్

    మధ్యప్రదేశ్

    Congress: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలోకి మాజీ సీఎం, అతని కుమారుడు! కాంగ్రెస్
    MadhyaPradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. పికప్ వాహనం బోల్తా పడి 14 మంది మృతి  భారతదేశం
    Madhya Pradesh: గుణలో కూలిన ట్రైనీ విమానం.. మహిళా పైలెట్‌కు తీవ్ర గాయాలు విమానం
    Madhya Pradesh: మధ్యప్రదేశ్ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు దగ్ధం  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025