NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pirate attack: తమిళనాడు మత్స్యకారులపై పైరెట్స్ దాడి.. 17 మందికి గాయాలు
    తదుపరి వార్తా కథనం
    Pirate attack: తమిళనాడు మత్స్యకారులపై పైరెట్స్ దాడి.. 17 మందికి గాయాలు
    తమిళనాడు మత్స్యకారులపై పైరెట్స్ దాడి.. 17 మందికి గాయాలు

    Pirate attack: తమిళనాడు మత్స్యకారులపై పైరెట్స్ దాడి.. 17 మందికి గాయాలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 03, 2025
    04:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తమిళనాడు మత్స్యకారులపై శ్రీలంక సముద్రపు దొంగలు దాడికి పాల్పడ్డారు.

    శుక్రవారం నాగపట్నం జిల్లాకు చెందిన 30 మంది మత్స్యకారులు కోరమండల్ తీరంలోని సముద్రంలో చేపలు వేటలో పాల్గొంటుండగా ఈ దాడి జరిగింది.

    ఫైబర్ బోటులో వచ్చి దాడి చేసిన ఆరుగురు పైరేట్స్‌ (సముద్రపు దొంగలు) మత్స్యకారుల వద్ద ఉన్న విలువైన వలలు, జీపీఎస్ పరికరాలు లూటీ చేశారు.

    వాటి విలువ దాదాపు రూ.10 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. పదునైన ఆయుధాలతో దాడికి దిగిన ఈ దొంగలు భారత మత్స్యకారుల పడవల్ని లక్ష్యంగా చేసుకుని తీవ్రంగా దాడి చేసినట్లు పేర్కొనబడింది.

    Details

    అగ్రహం వ్యక్తం చేసిన మత్య్సకారులు

    ఈ ఘటన భారత జలసరిహద్దుల్లోనే చోటుచేసుకున్నదని మత్స్యకారులు స్పష్టంగా తెలిపారు. ఘటనలో గాయపడిన 17 మందిని ఒడ్డుకు వచ్చిన తర్వాత జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

    ఈ దాడిపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే జోక్యం చేసుకోవాలని, తమకు భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి దాడులు మరోసారి జరుగితే నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు.

    గతేడాది డిసెంబరులో కూడా ఇలాంటి ఘటన జరిగినట్లు గుర్తు చేశారు. అప్పట్లో ముగ్గురు మత్స్యకారులు గాయపడిన సంగతి తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తమిళనాడు
    శ్రీలంక

    తాజా

    NASA: సౌర కుటుంబానికి బయట నీటి ఉనికి గుర్తించిన నాసా నాసా
    Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్‌ దేవరకొండ విజయ్ దేవరకొండ
    Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!  హర్యానా
    Emergency fund: ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి.. ఎలా మొదలుపెట్టాలి..? పూర్తి వివరాలివే! వ్యాపారం

    తమిళనాడు

    Tamil Nadu: దిండిగల్‌లోని ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. పలువురు మృతి  భారతదేశం
    Tamil Nadu: ఆలయ హుండీలో పడిన ఐఫోన్.. దేవుడి సొత్తుగా ప్రకటించిన ఆలయాధికారులు  ఇండియా
    Rameswaram: రామేశ్వరం తీరంలో బట్టలు మార్చుకునే గదిలో రహస్య కెమెరా.. ఇద్దరి అరెస్ట్ భారతదేశం
    Tamilnadu: ఆసక్తికరంగా తమిళనాడు రాజకీయం.. కొరడాతో శిక్షించుకున్న అన్నామలై  భారతదేశం

    శ్రీలంక

    IND vs SL: శ్రీలంక టూరుకు టీమిండియా.. భారత ఆటగాళ్లు సాధించిన ఘనతలివే టీమిండియా
    IND vs SL : ఇవాళ ఇండియా, శ్రీలంక టీ20 మ్యాచ్.. పిచ్ గురించి తెలుసుకోండి టీమిండియా
    IND vs SL : భారత్‌పై నాలుగు వికెట్లతో విజృంభించిన మతీషా పతిరనా టీమిండియా
    IND vs SL : మొదటి టీ20లో టీమిండియా సూపర్ విక్టరీ టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025