NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pm Internship Scheme: నేటి నుంచి పీఎం ఇంటర్న్‌షిప్ పథకం ప్రారంభం.. ప్రాసెస్ ప్రయోజనాలను తెలుసుకోండి
    తదుపరి వార్తా కథనం
    Pm Internship Scheme: నేటి నుంచి పీఎం ఇంటర్న్‌షిప్ పథకం ప్రారంభం.. ప్రాసెస్ ప్రయోజనాలను తెలుసుకోండి
    నేటి నుంచి పీఎం ఇంటర్న్‌షిప్ పథకం ప్రారంభం

    Pm Internship Scheme: నేటి నుంచి పీఎం ఇంటర్న్‌షిప్ పథకం ప్రారంభం.. ప్రాసెస్ ప్రయోజనాలను తెలుసుకోండి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 03, 2024
    10:22 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 సాధారణ బడ్జెట్‌లో పీఎం ఇంటర్న్‌షిప్ పథకాన్ని ప్రకటించారు.

    ఇది నేటి నుండి అమలులోకి రానుంది. ఈ పథకానికి సంబంధించిన పోర్టల్ త్వరలో ప్రారంభమవుతుందని, ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 12 నుండి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

    ఈ పథకం ద్వారా వచ్చే 5సంవత్సరాల్లో దేశంలోని 500 ప్రముఖ కంపెనీల్లో కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించనున్నారు.

    ఈ పథకంలో భాగంగా ఇంటర్న్‌షిప్ పొందే వారికి నెలకు రూ.5,000,ఏకమొత్తంలో రూ.6,000 అలవెన్స్ ఇవ్వబడుతుంది.

    ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం కోసం 12నెలల అనుభవం అందించబడుతుంది.

    కంపెనీలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల నుండి శిక్షణ, ఇతర ఖర్చులలో 10 శాతం భరిస్తాయి.

    వివరాలు 

    'అమృత్' ప్రారంభించిన ప్రధాని మోదీ 

    ప్రధాని నరేంద్ర మోదీ 'అమృత్' ప్రాజెక్టును ప్రారంభించారు. ఇది పరిశుభ్రతకు సంబంధించిన 10 వేల కోట్ల రూపాయలతో రూపొందించిన ప్రాజెక్ట్.

    ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టులో మిషన్ అమృత్, అమృత్ 2.0 లో భాగం.

    ఈ ప్రాజెక్టుల కింద దేశంలోని అనేక నగరాల్లో నీరు, వ్యర్థాల శుద్ధి కేంద్రాలను నిర్మించనున్నారు.

    అక్టోబర్ 2 నాటికి స్వచ్ఛ భారత్ మిషన్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

    వివరాలు 

    స్వచ్ఛ భారత్‌ మిషన్‌పై ప్రధాని మోదీ 

    స్వచ్ఛ భారత్ మిషన్ గురించి మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ ఇది కోట్లాది మంది భారతీయుల నిబద్ధతకు ప్రతీక అని, ప్రపంచంలోనే అతిపెద్ద మరియు విజయవంతమైన సామూహిక ఉద్యమం అని అభివర్ణించారు.

    అభివృద్ధి చెందుతున్న భారతదేశం కోసం పరిశుభ్రత ప్రధానమైనదని, ఈ మిషన్‌లో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని, సఫాయి మిత్రలు, మత పెద్దలు, క్రీడాకారులు, సెలబ్రిటీలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సహచరులను ప్రశంసించారు.

    రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతులు కూడా ఈ ఉద్యమానికి తోడ్పడారని, ఈ ఉద్యమం సర్క్యులర్ ఎకానమీకి కొత్త దిశను ఇచ్చిందని అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    నరేంద్ర మోదీ

    Rahul Gandi: బీజేపీపై ప్రజల్లో భయం పోయింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ  రాహుల్ గాంధీ
    Prahlad Joshi: 2030 నాటికి 500 GW పునరుత్పాదక ఇంధనమే లక్ష్యం గుజరాత్
    Semicon India 2024: నేడు ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో సెమికాన్ ఇండియా 2024 కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ..   నోయిడా
    Semicon 2024: ఇండియన్ మేడ్ చిప్ మా కల.. సెమికాన్ 2024 కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025