NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi address B20: అన్ని సమస్యలకు భారత్ దగ్గరే పరిష్కారం: బీ20 సదస్సులో ప్రధాని మోదీ 
    తదుపరి వార్తా కథనం
    PM Modi address B20: అన్ని సమస్యలకు భారత్ దగ్గరే పరిష్కారం: బీ20 సదస్సులో ప్రధాని మోదీ 
    అన్ని సమస్యలకు భారత్ దగ్గరే పరిష్కారం: బీ20 సదస్సులో ప్రధాని మోదీ

    PM Modi address B20: అన్ని సమస్యలకు భారత్ దగ్గరే పరిష్కారం: బీ20 సదస్సులో ప్రధాని మోదీ 

    వ్రాసిన వారు Stalin
    Aug 27, 2023
    03:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలో జరిగిన బిజినెస్ 20(బీ-20) సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కీలక ప్రసంగం చేశారు. బీ20 అధ్యక్ష పదవిని బ్రెజిల్‌కు అప్పగించిన సందర్భంలో ప్రధాని మోదీ ఈ ప్రసంగం చేశారు.

    ఆగస్టు 23న చంద్రయాన్‌-3ని విజయవంతంగా ల్యాండింగ్‌ చేయడంతో భారతదేశంలో పండుగల సీజన్‌ ప్రారంభమైందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

    దేశంలో వేడుకలు జరుగుతున్న సమయంలో వ్యాపారుయం బీ20 సదస్సుకు వచ్చారని మోదీ వివరించారు. ఆఫ్రికన్ యూనియన్‌ను జీ20లో శాశ్వత సభ్యత్వం పొందేందుకు ఆహ్వానించామని ఆయన తెలిపారు.

    చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతం చేయడంలో ఇస్రో కీలక పాత్ర పోషించినట్లు మోదీ పేర్కొన్నారు. ఇందులో భారతదేశ పరిశ్రమలు కూడా ముఖ్యమైన పాత్ర పోషించాయన్నారు. దీంతో ఈ వేడుక భారతదేశ వృద్ధిని వేగవంతం చేయడానికి దోహదపడుతుందన్నారు.

    మోదీ

    కరోనా కాలంలో 150 కంటే ఎక్కువ దేశాలకు కరోనా మందుల సరఫరా: మోదీ

    భారతదేశం అన్ని సమస్యలకు పరిష్కార మార్గమని, సమర్థవంతమైన, విశ్వసనీయమైన ప్రపంచ సరఫరా గొలుసును నిర్మించడంలో తమ దేశం ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉందన్నారు.

    కరోనా సమయంలో వ్యాక్సిన్‌లను భారత్ సరఫరా చేసిన విధానాన్ని, 'ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్'గా దేశం అవతరించిన అంశాన్ని మోదీ గుర్తు చేశారు. ప్రపంచానికి మందులు అవసరమైనప్పుడు, కోవిడ్ మహమ్మారి సమయంలో భారతదేశం 'ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్'గా 150 కంటే ఎక్కువ దేశాలకు మందులను అందించినట్లు గుర్తు చేశారు.

    ప్రపంచానికి కోవిడ్ ఔషధం అవసరమైనప్పుడు, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది విలువైన ప్రాణాలను కాపాడేందుకు భారతదేశం తన సొంత వ్యాక్సిన్ల ఉత్పత్తిని మెరుగుపరిచిందన్నారు.

    మోదీ

    క్రిప్టోకరెన్సీలకు సమగ్రమైన గ్లోబల్ విధానం అవసరం: మోదీ

    క్రిప్టోకరెన్సీలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవడానికి తమ దేశానికి సమగ్ర విధానం అవసర ఉందని మోదీ పేర్కొన్నారు.

    పరిశ్రమ 4.0 యుగంలో భారతదేశం డిజిటల్ విప్లవానికి ముఖంగా మారిందన్నారు. విశ్వసనీయమైన ప్రపంచ సరఫరా గొలుసును నిర్మించడంలో కూడా ముఖ్యమైన స్థానాన్ని భారత్ కలిగి ఉందన్నారు.

    అలాగే ఏడాకోసారి 'అంతర్జాతీయ వినియోగదారుల సంరక్షణ దినోత్సవాన్ని' నిర్వహించుకోవాల్సిన అవసరాన్ని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు.

    వినియోగదారుల సంరక్షణపై దృష్టి పెట్టాలని కోరారు. క్రిప్టోకరెన్సీలపై గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్, కృత్రిమ మేధస్సు (AI) యొక్క నైతిక వినియోగం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం పిలుపునిచ్చారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రధాని మోదీ ప్రసంగం

    #WATCH | Prime Minister Narendra Modi at the B-20 Business Summit asks businesses to focus on consumer care rather than just celebrating consumer rights day. pic.twitter.com/UOQmPiBbio

    — ANI (@ANI) August 27, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    దిల్లీ
    వాణిజ్యం
    వ్యాపారం

    తాజా

    Success Tips: ఓటములతో కుంగిపోతున్నారా? ఇలా చేస్తే విజయం మీదే ! జీవనశైలి
    Klaasen Retirement: సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ క్లాసెన్ రిటైర్మెంట్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు సౌత్ ఆఫ్రికా
    India EV Policy 2025: పెద్ద పెట్టుబడులు, తక్కువ పన్నులు ఆటో మొబైల్
    KCR: కాళేశ్వరం కేసులో కీలక మలుపు.. కేసీఆర్‌ విచారణకు కొత్త తేదీ ఖరారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    నరేంద్ర మోదీ

    దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్లకు మహర్దశ.. ఆగస్ట్ 6న మోదీ శంకుస్థాపన రైల్వే స్టేషన్
    PM Modi: 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన  ప్రధాన మంత్రి
    కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. 6.4 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ అనుసంధానం ప్రధాన మంత్రి
    'దిల్లీ సర్వీసెస్ బిల్లు'కు రాజ్యసభలో ఆమోదం; సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఆప్ దిల్లీ సర్వీసెస్ బిల్లు

    దిల్లీ

    ఢిల్లీలో ఫ్యాషన్ డిజైనర్ మృతి.. హత్య.. ఆత్మహత్యా..! పోలీస్
    అమిత్ షాతో బండి సంజయ్ భేటీ; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ  తెలంగాణ
    'ఇండియా' కూటమిపై మోదీ ధ్వజం.. మరోసారి కేంద్రంలో బీజేపీదే అధికారమని ధీమా నరేంద్ర మోదీ
    ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలను ఆ రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కరించుకోవాలి: కేంద్రం  హోంశాఖ మంత్రి

    వాణిజ్యం

    డబ్ల్యూటీఓలోని 6వాణిజ్య వివాదాల పరిష్కారానికి భారత్ - అమెరికా అంగీకారం  అమెరికా

    వ్యాపారం

    US కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్న మెక్‌డొనాల్డ్స్ ఉద్యోగుల తొలగింపు
    అవుట్‌పుట్ తగ్గింపుతో పెరిగిన చమురు ధరలు ప్రకటన
    ముడిచమురుపై విండ్ ఫాల్ పన్నును సున్నాకి తగ్గించిన కేంద్రం ప్రభుత్వం
    2024 ఆర్ధిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి అంచనాను 6.3%కి తగ్గించిన ప్రపంచ బ్యాంక్ బ్యాంక్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025