Pm Modi: పెరుగుతున్న ఎండలపై ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విజ్ఞప్తి
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండలు మరింత తీవ్రంగా మారుతున్నాయని, దీనివల్ల ప్రజల దైనందిన జీవనంపై ప్రభావం పడుతోందని తెలిపారు. ముఖ్యంగా అధిక వేడి కారణంగా ఆరోగ్యసమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలు శరీరంలో నీటి శాతం తగ్గిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని మోదీ కోరారు. బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా తాగునీరు వెంట తీసుకెళ్లాలని సూచించారు. అవసరం లేకపోతే ఎండలో ఎక్కువసేపు తిరగకూడదని చెప్పారు.తీవ్ర వేసవిలో ఒకరికి ఒకరు సహాయం చేసుకునే భావనతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
వివరాలు
అవసరమైన వారికి సహాయం చేయాలని ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి
దాహంతో ఉన్న వారికి ఒక గ్లాసు నీరు అందించడం కూడా గొప్ప సేవేనని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇళ్ల ముందు, వ్యాపార సంస్థల బయట మట్టికుండల్లో తాగునీరు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిని ఆయన అభినందించారు. ఎండల సమయంలో మానవత్వంతో ముందుకు వచ్చి అవసరమైన వారికి సహాయం చేయాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ విషయాలను సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్లో పోస్టు ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నరేంద్ర మోదీ చేసిన ట్వీట్
Different parts of India are witnessing soaring temperatures and the challenges that come with it. This heat is harsh on all of us and I urge you all to take as many precautions as possible. Please stay hydrated, keep water with you when stepping out. Offer a glass of water to…
— Narendra Modi (@narendramodi) May 27, 2026