NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Modi Fire-Congress: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మీ సంపద గోవిందా...కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    Modi Fire-Congress: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మీ సంపద గోవిందా...కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ
    సభలో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

    Modi Fire-Congress: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మీ సంపద గోవిందా...కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Stalin
    Apr 22, 2024
    03:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కాంగ్రెస్ (Congress) పార్టీకి ఓటు వేస్తే మీ సంపద మొత్తం గోవిందా అని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) దేశ ప్రజల్ని హెచ్చరించారు.

    ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్ (Rajasthan)లో జరిగిన ఓ సభలో ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు.

    ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర విమర్శలు చేశారు.

    మన్మోహన్ సింగ్ (Manmohan Singh) ప్రధాని గా చేసిన కాలంలో ఈ దేశ సంపదపై మొదటి హక్కు ముస్లిం (Muslims) లదే అని చేసిన వ్యాఖ్యల్ని ప్రధాని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

    ప్రజల సంపదను చొరబాటుదారులకు లేదా ఎక్కువ జనాభా ఉన్నవారికి పంచి పెడతారా అని ప్రశ్నించారు.

    PM Modi-Rajasthan

    ప్రజల కష్టార్జితం వారి ఆత్మగౌరవం: ప్రధాని మోదీ

    ప్రజలు బాగా కష్టపడి సంపాదించిన డబ్బును ప్రభుత్వం జప్తు చేసుకునే హక్కు ప్రభుత్వాలకు ఉందా అని మోదీ ప్రశ్నించారు.

    మహిళల దగ్గర ఉన్న బంగారం వివరాలన్నింటినీ సేకరిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో (Manifesto)లో ఆపార్టీ పేర్కొందని మోదీ చెప్పారు.

    ప్రజల కష్టార్జితం, మహిళల బంగారం వారి వారి ఆత్మగౌరవంగా మోదీ అభివర్ణించారు.

    వారి కష్టార్జితాన్ని ప్రజలకు పంచిపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రధాని మోదీ ప్రశ్నించారు.

    కాగా, ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

    ముస్లింలను చొరబాటుదారులంటారా? అని కొంతమంది, మన్మోహన్ సింగ్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ మరికొంతమంది విబేధిస్తున్నారు.

    అయితే మోదీ చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రంగా ఖండించారు.

    Rahul Gandhi-Criticism 

    కాంగ్రెస్ మేనిఫెస్టోలో అవి లేవు: రాహుల్​ గాంధీ

    ప్రధాని మోదీ చెబుతున్న అంశాలేవీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేవని రాహుల్ ​గాంధీ స్పష్టం చేశారు.

    మొదటిదశ ఎన్నికలు ముగిసిన తర్వాత నరేంద్ర మోదీ బాగా నిరాశకు గురయ్యారని అన్నారు.

    దీంతో నరేంద్ర మోదీ మరిన్ని అబద్ధాలు మాట్లాడటం పెంచారని రాహుల్ గాంధీ విమర్శించారు.

    ఓటమి భయంతో ఇప్పుడున్న సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు నరేంద్ర మోదీ ఆడుతున్న నాటకంగా రాహుల్ గాంధీ అభివర్ణించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రధాని గా ఉన్నప్పుడు మన్మోహన్​ సింగ్​ చేసిన వ్యాఖ్యల వీడియో...

    "We will have to devise innovative plans to ensure that minorities, particularly the Muslim minority, are empowered to share equitably in the fruits of development. They must have the first claim on resources."

    - Dr Manmohan Singh, 9th Dec, 2006

    The Congress doesn’t trust their… https://t.co/MWAf8uP23N pic.twitter.com/EDAKfasXT8

    — BJP (@BJP4India) April 21, 2024

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    Twitter Post

    पहले चरण के मतदान में निराशा हाथ लगने के बाद नरेंद्र मोदी के झूठ का स्तर इतना गिर गया है कि घबरा कर वह अब जनता को मुद्दों से भटकाना चाहते हैं।

    कांग्रेस के ‘क्रांतिकारी मेनिफेस्टो’ को मिल रहे अपार समर्थन के रुझान आने शुरू हो गए हैं।

    देश अब अपने मुद्दों पर वोट करेगा, अपने…

    — Rahul Gandhi (@RahulGandhi) April 21, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    బీజేపీ
    ప్రధాన మంత్రి
    కాంగ్రెస్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    నరేంద్ర మోదీ

    PM Modi: ప్రధాని మోదీ బిజీబిజీ.. 10రోజుల్లో తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో పర్యటన ఎన్నికలు
    PM Modi : నేడు, రేపు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన.. షెడ్యూల్ ఇదే  తెలంగాణ
    PM Modi: కుటుంబ పార్టీలను నమ్మొద్దు.. బీజేపీతో తెలంగాణ అభివృద్ధి: ప్రధాని మోదీ  ఆదిలాబాద్
    #ModiKaParivar : 'లాలూ' ఎఫెక్ట్.. సోషల్ మీడియాలో బీజేపీ 'మోదీ కా పరివార్' ప్రచారం  లాలూ ప్రసాద్ యాదవ్

    బీజేపీ

    Chandigarh: బీజేపీలోకి చేరిన ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు.. చండీగఢ్ కార్పొరేషన్‌లో మారిన నంబర్ గేమ్  చండీగఢ్
    Assam CM to Basara: బాసరకు అస్సాం సీఎం.. విజయ సంకల్ప రథయాత్రలకు శ్రీకారం హిమంత బిస్వా శర్మ
    BJP first List: ఫిబ్రవరి 29న 100మందితో బీజేపీ తొలి జాబితా విడుదల  లోక్‌సభ
    West Bengal: మమతా బెనర్జీని 'ఆంటీ' అని పిలవండి: సువేందు అధికారి  పశ్చిమ బెంగాల్

    ప్రధాన మంత్రి

    మోదీ సభ ముందు రాజస్థాన్ బీజేపీలో ముసలం..వసుంధర రాజే, గజేంద్ర ఐక్యత నిలిచేనా రాజస్థాన్
    అక్టోబర్ 1న తెలంగాణకు ప్రధాని మోదీ.. రూ.21,500కోట్ల విలువైన ప్రాజెక్టులను శంకుస్థాపన  నరేంద్ర మోదీ
    PM Modi: 'స్వచ్ఛ భారత్' కోసం చీపురు పట్టి చెత్త ఎత్తిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    తెలంగాణకు 9ఏళ్లలో రూ.లక్ష కోట్ల నిధులిచ్చాం.. రాష్ట్రంలో అవినీతి పాలన పోవాలి: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    కాంగ్రెస్

    Lok Sabha Elections: 5 రాష్ట్రాల్లో ఆప్- కాంగ్రెస్ కుదిరిన పొత్తు  ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    Congress: కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప కన్నుమూత  కర్ణాటక
    Nitasha Kaul: భారత్‌కు వచ్చిన బ్రిటన్‌ ప్రొఫెసర్‌.. అనుమతి లేదంటూ తిప్పి పంపేసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు బ్రిటన్
    Geeta Koda: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన ఏకైక ఎంపీ  బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025