
PM Modi: భారత్'లో 2500 రాజకీయ పార్టీలు.. ఘనా పార్లమెంట్లో ప్రసంగించిన ప్రధాని మోదీ..!
ఈ వార్తాకథనం ఏంటి
విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఘనా పార్లమెంటులో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజాస్వామ్యం ప్రాముఖ్యతను ప్రస్తావించారు. తన ప్రసంగంలో భారతదేశాన్ని "ప్రజాస్వామ్యానికి తల్లి"గా అభివర్ణించారు. ప్రజాస్వామ్య పరిపాలనలో పారదర్శకత, చర్చల ప్రాముఖ్యత గురించి వివరంగా తెలియజేశారు. ఈ ప్రసంగాన్ని మోదీ ఇంగ్లీషులో అందించారు. భారతదేశంలో 2,500కు పైగా రాజకీయ పార్టీలు ఉన్నాయి అని ప్రధాని పేర్కొనడంతో, ఘనా పార్లమెంటు సభ్యులు ఆశ్చర్యంతో చిరునవ్వులు చిందించారు. ఆ విషయాన్ని మోదీ మరోసారి స్పష్టం చేస్తూ, "నేను మళ్లీ చెబుతున్నాను - ఇండియాలో 2,500 రాజకీయ పార్టీలు ఉన్నాయి" అన్నారు.
వివరాలు
హమారే లియే లోక్తంత్ర వ్యవస్థ నహీ, సంస్కార్ హై
ప్రజాస్వామ్య భావన చర్చలకు ఆస్కారం కల్పిస్తుంది,ప్రజలను ఐక్యం చేస్తుంది,గౌరవాన్ని పెంపొందిస్తుంది,మానవ హక్కులను ప్రోత్సహిస్తుంది అని ప్రధాని మోదీ వివరించారు. "హమారే లియే లోక్తంత్ర వ్యవస్థ నహీ, సంస్కార్ హై" అంటూ మోదీ హిందీలో పేర్కొన్న అనంతరం, ఆ భావనను "మాకు ప్రజాస్వామ్యం ఒక విధానం మాత్రమే కాదు, అది మా సంస్కారం కూడా" అని ఇంగ్లీషులో మళ్లీ వివరించారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు బలంగా నిలిచే అంశంగా దేశంలోని విస్తృత వైవిధ్యాన్ని ఆయన గుర్తు చేశారు.
వివరాలు
2,500 రాజకీయ పార్టీలు
"భిన్న రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న సుమారు 20 వేర్వేరు పార్టీలు, 22 అధికారిక భాషలు, వేలాది మాండలికాలు - ఇవన్నీ భారత వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఇతర దేశాల నుండి వచ్చినవారిని హృదయపూర్వకంగా స్వీకరించే సహజ స్వభావం కూడా మా దేశంలో ఉంది" అని మోదీ పేర్కొన్నారు. "ఇలాంటి ఆత్మసాత్కరణే భారతీయులు ఎక్కడికి వెళ్లినా స్థానికులతో సులభంగా కలిసిపోవడానికి సహాయపడుతోంది" అని ఆయన వివరించారు. ప్రధాని ప్రసంగం అనంతరం, ఘనా పార్లమెంట్ స్పీకర్ అల్బన్ కింగ్స్ఫోర్డ్ సుమనా బాగ్బిన్ మోదీ ప్రస్తావించిన "2,500 రాజకీయ పార్టీలు" అనే అంశాన్ని మళ్లీ ఉదహరించడంతో సభలో నవ్వుల వాతావరణం ఏర్పడింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఘనా పార్లమెంట్లో ప్రసంగిస్తున్న మోదీ
#WATCH | Addressing the Parliament of the Republic of Ghana, PM Narendra Modi says, "...The people of India have reposed their faith in peace, security and development. Last year, they re-elected the same government for the third consecutive time, something that happened after… pic.twitter.com/24R6FOFQDA
— ANI (@ANI) July 3, 2025