NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: కొందరు కావాలనే సభను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు: ప్రధాని మోదీ 
    తదుపరి వార్తా కథనం
    PM Modi: కొందరు కావాలనే సభను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు: ప్రధాని మోదీ 
    కొందరు కావాలనే సభను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు: ప్రధాని మోదీ

    PM Modi: కొందరు కావాలనే సభను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు: ప్రధాని మోదీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 25, 2024
    11:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ రోజు (సోమవారం) శీతాకాల సమావేశాల ప్రారంభం ముందు, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ వెలుపల మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, అధికార, విపక్ష సభ్యులకు పార్లమెంట్‌లో సార్థకమైన చర్చలు జరగాలని కోరారు.

    ప్రస్తుతం మనం 2024వ సంవత్సరాన్ని పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నప్పుడు, 2025కు దేశం మొత్తం సిద్ధమవుతుందని చెప్పారు.

    ఈ పార్లమెంట్ సమావేశం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే మనం భారత రాజ్యాంగాన్ని ఆమోదించి, ఈ నవంబర్ 26న 75వ సంవత్సరంలో అడుగు పెడుతున్నామని మోడీ పేర్కొన్నారు.

    ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, రేపు రాజ్యాంగ దినోత్సవాన్ని సదన్‌లో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

    వివరాలు 

    గూండాయిజం ప్రేరేపించి,పార్లమెంట్‌ను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు: మోదీ 

    అదేవిదంగా,ప్రజల చేత తిరస్కరణకు గురైన కొంతమంది గూండాయిజం ప్రేరేపించి,పార్లమెంట్‌ను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రధాని మోడీ ఆరోపించారు.

    వారు చేసే చర్యలు దేశ ప్రజల దృష్టికి వస్తున్నాయని,సమయం వచ్చినప్పుడు వారు ఈ చర్యలపై ప్రతిస్పందిస్తారని ఆయన స్పష్టం చేశారు.

    అయితే, ఇదివరకటి అంశం గురించి ఆయన మాట్లాడుతూ,కొత్తగా పార్లమెంట్‌కు ఎన్నికైన ప్రతిఒక్కరూ కొత్త ఆలోచనలతో వచ్చే అవకాశం ఉంది, కానీ కొందరు చేసే గందరగోళ చర్యల వల్ల కొత్త ఎంపీలకు సభలో మాట్లాడే అవకాశాలు తగ్గిపోతున్నాయని చెప్పారు.

    ఈ పరిస్థితుల్లో,ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవిస్తూ, ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకునే దిశగా వారు ముందుకు పోవాలని కోరారు.

    ఇలాంటి వారికి ప్రజలపై ఎలాంటి బాధ్యత ఉండదు..కాబట్టి ప్రజల అంచనాలను ఎన్నటికీ అందుకోలేరని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    నరేంద్ర మోదీ

    Chandrababu: 'ఏపీ-2047 విజన్' కోసం ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక చర్చలు  చంద్రబాబు నాయుడు
    Chandrababu Naidu: 'ఆధునికాంధ్ర కోసం మా ప్రయాణం'.. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు
    Central Cabinet Meeting: నేడు కేంద్ర కేబినెట్‌ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం.. కేంద్ర కేబినెట్
    Narendra Modi: దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు 'నో ఎంట్రీ'.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు  బీజేపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025