Page Loader
PM Modi: ముంబయి వేదికగా 'వేవ్స్‌' 2025ను ప్రారంభించిన మోదీ
ముంబయి వేదికగా 'వేవ్స్‌' 2025ను ప్రారంభించిన మోదీ

PM Modi: ముంబయి వేదికగా 'వేవ్స్‌' 2025ను ప్రారంభించిన మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
May 01, 2025
12:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయంగా భారత్‌ను గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ కేంద్రంగా మారుస్తుందనే దృష్టితో కేంద్ర ప్రభుత్వం 'వేవ్స్ 2025' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ముంబయిలో నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సమ్మిట్‌ ఈరోజు అధికారికంగా ప్రారంభమైంది. ఈ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన భారత చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా నటీనటులు, కళాకారులు అందిస్తున్న అమూల్యమైన సేవలను ప్రధాని ప్రశంసించారు. పరిశ్రమ ఎదుగుదల కోసం వారి కృషిని ఆయన కొనియాడారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 'వేవ్స్ 2025'వేడుకలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ