Muft Bijli: 'ముఫ్ట్ బిజ్లీ' పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మరోసారి గుడ్న్యూస్ చెప్పారు. సౌర విద్యుత్తు, స్థిరమైన పురోగతిని పెంచే ప్రయత్నంలో, తమ ప్రభుత్వం 'ప్రధాన మంత్రి సూర్య ఘర్.. ముఫ్త్ బిజిలీ యోజన'ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా కోటి గృహాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తామన్నారు. ఈ ప్రాజెక్ట్ పై ప్రభుత్వం ₹ 75,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనుందని ప్రధాని మోదీ చెప్పారు. ప్రజల బ్యాంకు ఖాతాలకు నేరుగా అందజేసే సబ్స్టాంటివ్ సబ్సిడీల నుంచి భారీ రాయితీతో కూడిన బ్యాంకు రుణాల వరకు ప్రజలపై ఎలాంటి భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తుందని మోదీ తెలిపారు.
వాటాదారులందరూ జాతీయ ఆన్లైన్ పోర్టల్కు అనుసంధానం
వాటాదారులందరూ జాతీయ ఆన్లైన్ పోర్టల్కు ఏకీకృతం చేయబడతారని ప్రధాన మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఈ పథకం ద్వారా ఆదాయంతో పాటు తక్కువ విద్యుత్ బిల్లులు, ప్రజలకు ఉపాధి కల్పనకు దారి తీస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ పథకాన్ని అట్టడుగు స్థాయిలో ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి, పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలు తమ అధికార పరిధిలో రూఫ్టాప్ సోలార్ సిస్టమ్లను ప్రోత్సహించాలని ప్రధాని మోదీ అన్నారు.