NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: మరోసారి రష్యా పర్యటనకు ప్రధాని మోదీ.. 'గ్రేట్‌ పేట్రియాటిక్‌ వార్‌' వార్షికోత్సవంలో పాల్గొనే అవకాశం
    తదుపరి వార్తా కథనం
    PM Modi: మరోసారి రష్యా పర్యటనకు ప్రధాని మోదీ.. 'గ్రేట్‌ పేట్రియాటిక్‌ వార్‌' వార్షికోత్సవంలో పాల్గొనే అవకాశం
    మరోసారి రష్యా పర్యటనకు ప్రధాని మోదీ.. 'గ్రేట్‌ పేట్రియాటిక్‌ వార్‌' వార్షికోత్సవంలో పాల్గొనే అవకాశం

    PM Modi: మరోసారి రష్యా పర్యటనకు ప్రధాని మోదీ.. 'గ్రేట్‌ పేట్రియాటిక్‌ వార్‌' వార్షికోత్సవంలో పాల్గొనే అవకాశం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 26, 2025
    12:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) మరోసారి రష్యా పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

    మాస్కోలో జరగనున్న 'గ్రేట్ పేట్రియాటిక్ వార్' 80వ వార్షికోత్సవ పరేడ్‌లో ఆయన పాల్గొనే అవకాశముందని సమాచారం.

    ఈ విషయాన్ని రష్యా వార్తా సంస్థ టాస్‌ వెల్లడించింది.టాస్‌ ప్రకారం, మే 9న మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో 'గ్రేట్ పేట్రియాటిక్ వార్' 80వ వార్షికోత్సవాన్ని జరుపనున్నారు.

    ఈ ప్రత్యేక కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశముందని సమాచారం.

    భారత సైనిక దళం కూడా ఈ పరేడ్‌లో కవాతు నిర్వహించనున్నట్లు వార్తలొచ్చాయి.

    అయితే, దీనిపై భారత విదేశాంగ శాఖ నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

    ఇదే సందర్భంగా, వివిధ దేశాధినేతలను పరేడ్‌కు ఆహ్వానిస్తున్నట్లు క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు.

    వివరాలు 

    16వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మోదీ 

    ఇదిలా ఉండగా,గతేడాది అక్టోబరులో మోదీ రష్యాలో పర్యటించారు.కజాన్‌లో జరిగిన 16వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు.

    బ్రిక్స్ సదస్సులో ప్రసంగించిన ఆయన,భారత్‌ ఎల్లప్పుడూ దౌత్యానికి, చర్చలకు మద్దతు తెలుపుతుందని, యుద్ధాన్ని వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.

    రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఆర్థిక అస్థిరత, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి సమస్యలపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.

    మరోవైపు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో, ఇరుదేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు అమెరికాతో పాటు పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి.

    ఈ పరిస్థితుల్లో మోదీ మాస్కో పర్యటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    నరేంద్ర మోదీ

    PM Modi: ఇన్నోవేషన్,ఇన్వెస్ట్మెంట్ లక్ష్యంగా బడ్జెట్ : మోదీ  భారతదేశం
    'Insult To Tribals':రాష్ట్రపతిని ఉద్దేశించి సోనియా గాంధీ,రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ప్రధాని మోదీ ఫైర్..  సోనియా గాంధీ
    People's Budget:"ప్రజల బడ్జెట్,పొదుపు,పెట్టుబడి పెరుగుతాయి".. బడ్జెట్‌పై స్పందించిన పీఎం మోదీ భారతదేశం
    Trump-Modi: ఫిబ్రవరి 13న వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ చర్చలు  డొనాల్డ్ ట్రంప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025