NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: నేవీలోకి 3 అధునాతన యుద్ధనౌకలు.. రెండు యుద్ధ నౌకలు, ఒక జలాంతర్గామిని ప్రారంభించిన ప్రధాని మోడీ..
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    PM Modi: నేవీలోకి 3 అధునాతన యుద్ధనౌకలు.. రెండు యుద్ధ నౌకలు, ఒక జలాంతర్గామిని ప్రారంభించిన ప్రధాని మోడీ..
    నేవీలోకి 3 అధునాతన యుద్ధనౌకలు.. రెండు యుద్ధ నౌకలు, ఒక జలాంతర్గామిని ప్రారంభించిన ప్రధాని మోడీ..

    PM Modi: నేవీలోకి 3 అధునాతన యుద్ధనౌకలు.. రెండు యుద్ధ నౌకలు, ఒక జలాంతర్గామిని ప్రారంభించిన ప్రధాని మోడీ..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 15, 2025
    01:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత నౌకాదళానికి మరో మూడు అస్త్రాలు చేరాయి. ఐఎన్‌ఎస్‌ సూరత్‌, ఐఎన్‌ఎస్‌ నీలగిరి, ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్‌ అనే ఆధునిక యుద్ధ నౌకలు నౌకాదళంలో చేర్చబడ్డాయి.

    ముంబయిలోని నేవల్‌ డాక్‌యార్డ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని, ఈ యుద్ధ నౌకలను జాతికి అంకితం చేశారు.

    వీటి రాకతో నౌకాదళ శక్తి మరింత బలపడింది. ఇది ఆయుధ తయారీ, సముద్ర భద్రతలో అగ్రగామి స్థానాన్ని పొందడానికి భారత్‌ తీసుకున్న ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తుంది.

    వివరాలు 

     నౌకాదళ బలోపేతానికి మరో ముందడుగు: మోదీ  

    ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, దేశ రక్షణలో సైనికుల సేవలు అమూల్యమని, వారు ప్రాణాలను పణంగా పెట్టి దేశానికి సేవ చేస్తున్నారని ప్రశంసించారు. నౌకాదళ బలోపేతానికి మరో ముందడుగు పడిందని, తొలిసారిగా రెండు యుద్ధ నౌకలు, జలాంతర్గామి ఒకేసారి ప్రారంభించబడిన విషయాన్ని హర్షించారు. ఇవి భారతీయ పరిశ్రమలతో తయారైనవే అని, వాటి ద్వారా నౌకాదళానికి కొత్త శక్తి, దార్శనికత అందుతుందని పేర్కొన్నారు.

    ప్రధాని మోదీ సముద్ర తీర రక్షణను మరింత పటిష్టం చేసేందుకు మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు.

    గత పదేళ్లలో 33 యుద్ధ నౌకలు,ఏడు జలాంతర్గాములు నౌకాదళంలో చేరాయని,రక్షణ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని వివరించారు.

    వివరాలు 

    75శాతం స్వదేశీ భాగస్వామ్యం 

    రక్షణ ఉత్పత్తుల విలువ రూ.1.25లక్షల కోట్లను దాటిందని, భారత రక్షణ పరికరాలను 100కు పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నామని,ప్రపంచ భాగస్వామిగా మారడమే లక్ష్యమని చెప్పారు.

    ఆయన పేర్కొన్న ఐఎన్‌ఎస్‌ సూరత్‌ పీ15బీ గైడెడ్‌ మిసైల్‌ డిస్ట్రాయర్‌ ప్రాజెక్ట్‌లో అభివృద్ధి చేస్తున్న నాల్గవ యుద్ధ నౌకగా నిలిచింది.

    ఇది ప్రపంచంలోనే అత్యంత అధునాతన డిస్ట్రాయర్‌ నౌకల్లో ఒకటి కాగా,ఇందులో 75శాతం స్వదేశీ భాగస్వామ్యం ఉంది.

    ఐఎన్‌ఎస్‌ నీలగిరి పీ17ఏ స్టెల్త్‌ ఫ్రిగేట్‌ ప్రాజెక్టులో అభివృద్ధి చేసిన తొలి యుద్ధ నౌకగా చరిత్ర సృష్టించింది. దీనిని శత్రువులను ఏమార్చగల స్టెల్త్‌ టెక్నాలజీతో తయారు చేశారు.

    ఫ్రాన్స్‌ నేవల్‌ గ్రూప్‌ సహకారంతో అభివృద్ధి చేసిన ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్‌ పీ75 ప్రాజెక్ట్‌లో తయారైన ఆరో, చివరి జలాంతర్గామిగా నిలిచింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    నరేంద్ర మోదీ

    Pm modi: ప్రధాని మోదీకి బెదిరింపు కాల్.. 34 ఏళ్ల మహిళ అరెస్ట్ భారతదేశం
    PM Modi: వైరల్‌గా మారిన ప్రధాని మోదీ భద్రతలో మహిళా కమాండో ఫొటో.. అసలు విషయం ఏంటంటే..? భారతదేశం
    PM Modi: "డిజిటల్ అరెస్టులు, డీప్ ఫేక్‌లపై దృష్టి పెట్టండి".. డీజీపీలు, ఐజీపీల సదస్సులో ప్రధాని మోదీ భారతదేశం
    Sabarmati Report: 'సబర్మతి రిపోర్ట్‌' చిత్రాన్ని పార్లమెంట్‌లో చూడనున్న ప్రధాని మోదీ గుజరాత్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025