NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: ఐదేళ్లలో అద్భుతమైన ఆవిష్కరణలు తీసుకొచ్చాం : 17వ లోక్‌సభ చివరి ప్రసంగంలో ప్రధాని మోదీ 
    తదుపరి వార్తా కథనం
    PM Modi: ఐదేళ్లలో అద్భుతమైన ఆవిష్కరణలు తీసుకొచ్చాం : 17వ లోక్‌సభ చివరి ప్రసంగంలో ప్రధాని మోదీ 
    PM Modi: ఐదేళ్లలో అద్భుతమైన సంస్కరణలు: 17వ లోక్‌సభ చివరి ప్రసంగంలో ప్రధాని మోదీ

    PM Modi: ఐదేళ్లలో అద్భుతమైన ఆవిష్కరణలు తీసుకొచ్చాం : 17వ లోక్‌సభ చివరి ప్రసంగంలో ప్రధాని మోదీ 

    వ్రాసిన వారు Stalin
    Feb 10, 2024
    08:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరి రోజైన శనివారం లోక్‌సభలో రామమందిర నిర్మాణానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది.

    ప్రధాని నరేంద్ర మోదీ సాయంత్రం 42 నిమిషాల పాటు ప్రసంగించారు. గత 5 సంవత్సరాలలో తన ప్రభుత్వం సాధించిన విజయాలను గురించి మోదీ వివరించారు.

    గత ఐదేళ్లలో లోక్‌సభలో ఎన్నో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నామని మోదీ అన్నారు. ఈ కాలంలో మానవజాతి శతాబ్దపు అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొన్నదని కరోనాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

    17వ లోక్‌సభలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని, మహిళా బిల్లును కూడా ఈ సభలోనే ఆమోదించినట్లు పేర్కొన్నారు.

    ఈ సభను దేశం ఆశీర్వదించనున్నది ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే 25 సంవత్సరాలు మన దేశానికి చాలా ముఖ్యమైనవనవి మోదీ అన్నారు.

    మోదీ

    కొత్త ప్రమాణాలను సృష్టించాం: మోదీ

    17వ లోక్‌సభ కొత్త ప్రమాణాలను సృష్టించిందని ప్రధాని అన్నారు. మన రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు కూడా ఈ కాలంలోనే పూర్తయ్యాయన్నారు.

    ఈ హయాంలో అనేక సంస్కరణలు జరిగాయన్నారు. 17వ లోక్ సభ గేమ్ ఛేంజర్ లాంటిదని, ఈ సభలో తీసుకున్న నిర్ణయాలు 21వ శతాబ్దపు బలమైన పునాది వేశయాన్నారు. తాము పెద్ద మార్పు దిశగా వేగంగా ముందుకు సాగామన్నారు.

    ఆర్టికల్ 370ని తొలగించి రాజ్యాంగానికి పూర్తి రూపాన్ని ఈ సభే ఇచ్చినట్లు మోదీ పేర్కొన్నారు.

    రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుల ఆత్మలు అందరినీ ఆశీర్వదించినట్లు చెప్పారు. ఇందుకోసం సభలోని సహచరులంతా తమ వంతు పాత్ర పోషించారన్నారు.

    మోదీ

    జీ20కి అధ్యక్షత వహించే అవకాశం

    ప్రధానమంత్రి మాట్లాడుతూ.. భారతదేశానికి G20 అధ్యక్షత వహించే అవకాశం లభించింన్నారు. భారతదేశానికి గొప్ప గౌరవం లభించిందన్నారు.

    దేశంలోని ప్రతి రాష్ట్రం భారతదేశ సామర్థ్యాన్ని, దాని గుర్తింపును ప్రపంచం ముందు ప్రదర్శించిందన్నారు. దాని ప్రభావం ఇప్పటికీ ప్రజల మనస్సుపై ఉందన్నారు.

    స్పీకర్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు

    లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. 'మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. మీ చిరునవ్వు ఎప్పటికీ చెరిగిపోలేదు.

    మీరు ఈ సభను చాలా సందర్భాల్లో సమతుల్యంగా, న్యాయంగా నడిపించారు. దీనికి నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ప్రత్యారోపణలు చేసినా మీరు ఓపికగా పరిస్థితిని నియంత్రించి సభను నడిపారు' అని మోదీ అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    లోక్‌సభ
    తాజా వార్తలు

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    నరేంద్ర మోదీ

    PM Modi: నేడు తమిళనాడుకు ప్రధాని మోదీ.. రూ. 19,850 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం భారతదేశం
    PM modi: ప్రధాని మోదీ 'స్నార్కెలింగ్‌'.. లక్షద్వీప్‌లో బీచ్‌లో సందడి  భారతదేశం
    Lok Sabha polls: ఆ రాష్ట్రం నుంచే ప్రధాని మోదీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం షురూ  బిహార్
    #Boycott Maldives: భారత్‌పై మాల్దీవ్స్ నేతల అక్కసు.. ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ మాల్దీవ్స్ హ్యాష్‌ట్యాగ్  మాల్దీవులు

    లోక్‌సభ

    వ్యాపారవేత్త దర్శన్‌కు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌‌లను నేనే ఇచ్చా: మహువా మోయిత్రా  మహువా మోయిత్రా
    Mahua Moitra:ఎథిక్స్ ప్యానెల్ ముందు న్యాయవాదిని 'క్రాస్ ఎగ్జామిన్' చేయాలనుకుంటున్నా: మహువా మోయిత్రా  మహువా మోయిత్రా
    Amit Shah: నెహ్రూ తప్పిదం వల్లే POK సమస్య వచ్చింది: అమిత్ షా అమిత్ షా
    Sammakka Saralamma Tribal University : ములుగు గిరిజన వర్సిటీకి లోక్‌సభ ఆమోదం ములుగు

    తాజా వార్తలు

    Earthquake: కార్గిల్‌, మేఘాలయలో వరుస భూకంపాలు  మేఘాలయ
    Tata Punch: రూ. 17,000 పెరిగిన 'టాటా పంచ్' కారు ధర టాటా మోటార్స్
    Telangana cabinet: టీఎస్ స్థానంలో టీజీ.. ఈ నెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలు... తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు  తెలంగాణ బడ్జెట్
    Jharkhand floor test: నేడు జార్ఖండ్‌లో చంపయ్ సోరెన్ ప్రభుత్వానికి బలపరీక్ష జార్ఖండ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025