Page Loader
Cherlapally Railway Terminal: నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ
నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ

Cherlapally Railway Terminal: నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 06, 2025
08:30 am

ఈ వార్తాకథనం ఏంటి

నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఢిల్లీ నుంచి ఈ ప్రారంభం జరుగనుంది. అత్యాధునిక హంగులతో, ఎయిర్‌పోర్ట్‌ను తలపించే విధంగా ఈ టెర్మినల్‌ను రూపకల్పన చేశారు. రూ.430 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ కొత్త టెర్మినల్ నిర్మాణం పూర్తయింది. ఇందులో 9 ప్లాట్‌ఫాములు, 9 లిఫ్టులు, 5 ఎస్కలేటర్లు, 2 విశాలమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేశారు. పాత రైల్వే స్టేషన్ల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ప్రత్యామ్నాయంగా చర్లపల్లి స్టేషన్‌ను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది.

వివరాలు 

ఈ నెల 18 నుంచి ప్రత్యేక రైళ్లు

ప్రారంభానికి ముందే చర్లపల్లి టెర్మినల్ నుంచి టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 18 నుంచి ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు ఆర్టీసీ, ఎంఎంటీఎస్ సర్వీసులను అందుబాటులో ఉంచుతామని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఈ టెర్మినల్ నుంచి మొత్తం 26 రైళ్ల ఆపరేషన్లు జరగనున్నాయి. భవిష్యత్తులో 30కి పైగా రైళ్లను ఈ టెర్మినల్ ద్వారా నడిపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.