PM Modi: ఢిల్లీలో బీజేపీ కార్యాలయానికి మోదీ.. కార్యకర్తలకు సందేశం
వ్రాసిన వారు
Sirish Praharaju
May 04, 2026
02:16 pm
ఈ వార్తాకథనం ఏంటి
పోలింగ్ ఫలితాల ట్రెండ్స్ బీజేపీకి అనుకూలంగా మారుతున్న వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ హెడ్క్వార్టర్స్కు వెళ్లనున్నారు. సాయంత్రం 6 గంటలకు పార్టీ కార్యాలయానికి చేరుకుని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయాన్ని పార్టీ ప్రధాన ప్రతినిధి అనిల్ బలూని వెల్లడించారు. ఇక పశ్చిమ బెంగాల్'లో బీజేపీ భారీ ఆధిక్యంలో ఉండగా, అస్సాంలో కూడా ముందంజలో కొనసాగుతోంది. తమిళనాడులో నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ పార్టీ ఆశ్చర్య ఫలితాలు నమోదు చేస్తుండగా, కేరళలో కాంగ్రెస్ ఆధిక్యం కనిపిస్తోంది. మొత్తం మీద ఎన్నికల ఫలితాల్లో కాషాయ పార్టీ జోరు స్పష్టంగా కనిపిస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అనిల్ బలూని చేసిన ట్వీట్
Hon'ble Prime Minister Shri Narendra Modi Ji will visit BJP HQ, New Delhi today at 6 PM.@narendramodi @BJP4India
— Anil Baluni (@anil_baluni) May 4, 2026