NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: నేడు కాశీలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. 44 ప్రాజెక్టులను ప్రారంభించి కాశీ ప్రజలకు అంకితం చేయనున్న ప్రధాని..
    తదుపరి వార్తా కథనం
    PM Modi: నేడు కాశీలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. 44 ప్రాజెక్టులను ప్రారంభించి కాశీ ప్రజలకు అంకితం చేయనున్న ప్రధాని..
    నేడు కాశీలో పర్యటించనున్న ప్రధాని మోదీ

    PM Modi: నేడు కాశీలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. 44 ప్రాజెక్టులను ప్రారంభించి కాశీ ప్రజలకు అంకితం చేయనున్న ప్రధాని..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 11, 2025
    08:48 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు(ఏప్రిల్ 11న)ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరానికి పర్యటనకు వస్తున్నారు.

    ఈ పర్యటనలో భాగంగా, ఆయన దాదాపు రూ.3,884 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

    ఉదయం 10గంటల సమయంలో మోదీ లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనుండగా,రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కలిసి ఆయనకు ఆత్మీయ స్వాగతం పలుకుతారు.

    విమానాశ్రయం నుంచి నేరుగా రాజతలాబ్ సమీపంలోని మెహందీగంజ్ ప్రాంతానికి ప్రయాణించి, మోదీ ఓ బహిరంగ సభలో పాల్గొంటారు.

    ఈ సందర్భంగా ప్రధాని మొత్తం రూ.3,884.18 కోట్ల వ్యయంతో రూపొందించిన 44అభివృద్ధి ప్రాజెక్టులను వారణాసివాసులకు అంకితం చేయనున్నారు.

    అందులో రూ.1,629.13 కోట్లతో నిర్మించనున్న 19ప్రాజెక్టులను ప్రారంభించనుండగా,మిగతా 25 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.

    వివరాలు 

    పాల ఉత్పత్తిదారులకు బోనస్‌

    ఈ అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా, బాబత్‌పూర్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో, యూనిటీ మాల్ దగ్గరనున్న జాతీయ రహదారి పై అండర్‌పాస్ టన్నెల్ వంటి పనులతో కలిపి,మొత్తం రూ.2,255.05కోట్ల విలువైన పనులు ఉన్నాయి.

    అదనంగా,ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ పథకంలోని కార్డులను ప్రజలకు అందించనున్నారు.

    ఇందులో భాగంగా, 70ఏళ్లు దాటి ఉన్న ముగ్గురు వృద్ధులకు మూడు భిన్నమైన జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ఉత్పత్తులతో పాటు ఆయుష్మాన్ కార్డు సర్టిఫికెట్లను అందజేయనున్నారు.

    ఇంకా,బనాస్ డెయిరీతో కలసి పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 2.70లక్షల మంది పాల ఉత్పత్తిదారులకు రూ.106 కోట్ల బోనస్‌ను ఆన్‌లైన్‌ ద్వారా నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.

    ఈకార్యక్రమాలు పూర్తయ్యాక,ప్రధాని మోదీ తిరిగి బాబత్‌పూర్ విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి గ్వాలియర్‌కు బయలుదేరుతారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్
    Kannappa : భీమవరంలో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. జూన్ 22న గ్రాండ్‌గా! మంచు విష్ణు

    నరేంద్ర మోదీ

    PM Modi: ఏఐతో భారత్ పురోగతి: మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ ఇండియా
    Meloni: లిబరల్స్‌ కుట్రలు నడవవు.. ఇటలీ ప్రధాని మెలోనీ ఘాటు వ్యాఖ్యలు ఇటలీ
    PM Modi: కుంభమేళాపై విపక్షాల విద్వేషపూరిత వ్యాఖ్యలు.. ప్రధాని మోదీ కౌంటర్ భారతదేశం
    PM Modi: ఊబకాయంపై అవగాహన కల్పించేందుకు.. 10 మందిని నామినేట్‌ చేసిన ప్రధాని మోదీ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025