నేడు వరంగల్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం వరంగల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10:45నుంచి 11:20గంటల మధ్య కోచ్ ఫ్యాక్టరీ సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఉదయం 11:45నుంచి 12:20గంటల మధ్య వరంగల్లో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. అనంతరం విమానంలో హైదరాబాద్కు వెళ్లి మధ్యాహ్నం 1:10గంటలకు హకీంపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్కు ప్రధాని చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన తన ప్రత్యేక విమానంలో రాజస్థాన్కు బయలుదేరుతారు. ఈసారి అయినా ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారా? లేదా? రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ప్రధాని మోదీ పర్యటనను బీఆర్ఎస్ బహిష్కరించినట్లు మరోవైపు ప్రచారం జరుగుతోది.