LOADING...
PM Modi: భారత్-అమెరికా సంబంధాలపై మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ఇరాన్ పరిస్థితులపై చర్చ
భారత్-అమెరికా సంబంధాలపై మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ఇరాన్ పరిస్థితులపై చర్చ

PM Modi: భారత్-అమెరికా సంబంధాలపై మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ఇరాన్ పరిస్థితులపై చర్చ

వ్రాసిన వారు Moogati Shabari
Apr 14, 2026
10:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం దాదాపు 40 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఫోన్ సంభాషణ జరిగింది. అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలమైన తర్వాత అక్కడ పరిస్థితులు మరింత సున్నితంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలో ఇరు నేతల మధ్య ఇది మూడోసారి జరిగిన సంభాషణగా, ఫిబ్రవరి 28న జరిగిన ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల ఏర్పడిన సంక్షోభం తర్వాత రెండో కాల్‌ సంభాషణ జరిగింది.

వివరాలు

ఫోన్ కాల్స్‌లో ఏం మాట్లాడుకున్నారంటే..

ఈ కాల్‌లో ట్రంప్ మాట్లాడుతూ "మేమంతా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం" అని చెప్పగా.. స్పందనగా ప్రధాని మోదీ "భారత ప్రజలు కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు" అని చెప్పారు. "కొన్ని నిమిషాల క్రితమే ఇద్దరూ ఫోన్ మాట్లాడుకున్నారు. అధ్యక్షుడు తరచూ ప్రధానమంత్రికి తాజా పరిస్థితులు తెలియజేస్తుంటారు. భారత్-అమెరికా మధ్య జరుగుతున్న ముఖ్యమైన అంశాలపై కూడా చర్చలు కొనసాగుతున్నాయి" అని అమెరికా రాయబారి సెర్జియో గోర్ పేర్కొన్నారు. ఈ ఫోన్ కాల్‌పై ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్‌లో స్పందిస్తూ, ఇరు దేశాల ద్వైపాక్షిక సహకారంలో సాధించిన గణనీయమైన పురోగతిని సమీక్షించినట్లు తెలిపారు. వివిధ రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇద్దరూ అంగీకరించినట్లు చెప్పారు.

వివరాలు

ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారంటే..

అలాగే పశ్చిమాసియా పరిస్థితులపై కూడా చర్చించినట్లు పేర్కొంటూ, హోర్ముజ్ జలసంధి సురక్షితంగా, తెరిచి ఉండాల్సిన అవసరాన్ని ఇద్దరూ హైలైట్ చేసినట్లు తెలిపారు. ఈ ఏడాదిలో ఇది ఇరు నేతల మూడో సంభాషణ. ఫిబ్రవరి 2న తొలిసారి ఫోన్‌లో మాట్లాడుకుని ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చించారు. తర్వాత మార్చి 24న పశ్చిమాసియా పరిస్థితులపై మరోసారి మాట్లాడుకున్నారు. తాజా కాల్‌కు ముందు వారాంతంలో ఇరాన్-అమెరికా చర్చలు ఇస్లామాబాద్‌లో దాదాపు 21 గంటల పాటు కొనసాగినా ఎలాంటి ఒప్పందం కుదరలేదు. దీంతో తాత్కాలిక కాల్పుల విరమణపై సందేహం కొనసాగుతోంది.

Advertisement

వివరాలు

ఆ చర్చలు విఫలమవ్వడానికి కారణమిదే..

ఈ చర్చల్లో ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వదిలిపెట్టేందుకు నిరాకరించిందని అమెరికా ఆరోపించగా, చర్చలను అమెరికానే విఫలం చేసిందని టెహ్రాన్ ఆరోపించింది. అమెరికా 20 ఏళ్ల పాటు యురేనియం శుద్ధీకరణను నిలిపివేయాలని ప్రతిపాదించగా, ఇరాన్ మాత్రం కేవలం 5 సంవత్సరాలకే ఒప్పుకోవడానికి సిద్ధమైందని పలు నివేదికల్లో పేర్కొన్నాయి. ఈ అంశాలపై వచ్చిన విభేదాలే వారాంతంలో జరిగిన చర్చలు విఫలమవడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

Advertisement