
PM Modi: శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ.. మల్లికార్జునస్వామికి పంచామృతాలలో రుద్రాభిషేకం
ఈ వార్తాకథనం ఏంటి
కర్నూలు పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారిని పూజించారు.ప్రత్యేకంగా, మల్లికార్జున స్వామికి పంచామృత రుద్రాభిషేకం, భ్రమరాంబదేవికి ఖడ్గమాల పూజ, కుంకుమార్చన పూజలు చేశారు. పూజల అనంతరం, ప్రధానమంత్రి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించి, అక్కడి శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరాలను పరిశీలించారు. ఈ సందర్శనలో ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీశైలం చేరుకున్నారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
శ్రీశైలం మల్లన్నని దర్శించుకున్న ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు
శ్రీశైలం మల్లన్నని దర్శించుకున్న ప్రధాని మోడీ గారు , పవన్ కళ్యాణ్ గారు , చంద్రబాబు గారు 😍🙏@narendramodi @PawanKalyan @ncbn pic.twitter.com/dIGmzEvzmQ
— Prasannakumar Nalle (@PrasannaNalle) October 16, 2025