PM Modi: నేడు నలందాకు ప్రధాన మంత్రి.. కొత్త యూనివర్సిటీ క్యాంపస్ ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
గతంతో భారతదేశ సంబంధాలను పునరుద్దరిస్తూ, నలంద విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం మాట్లాడారు.
కొన్ని శతాబ్దాలుగా ప్రపంచంలోని "యువత విద్యా అవసరాలను తీర్చడంలో వర్సిటీ చాలా ముందుకు వెళ్తుంది" అని అన్నారు.
వివరాలు
నలందకు ఘనమైన చరిత్ర
ఈ విషయమై మోదీ ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు.
"ఇది మన విద్యా రంగానికి చాలా ప్రత్యేకమైన రోజు.ఈ రోజు ఉదయం 10:30గంటలకు,నలంద విశ్వవిద్యాలయం,కొత్త క్యాంపస్ రాజ్గిర్లో ప్రారంభం కానుంది. నలందకు ఘనమైన చరిత్ర వుంది. ఈ అద్భుతమైన భాగంలో భారత్ కు బలమైన అనుబంధం ఉంది" అని రాసుకొచ్చారు.
అధికారిక ప్రకటన ప్రకారం,ప్రధాని మోదీ ఉదయం 10:30 గంటలకు నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత జరిగే సభలోప్రసంగించనున్నారు.
ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత,నరేంద్ర మోదీ బిహార్ రావడం ఇదే తొలి సారి.
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్,బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్,ముఖ్యమంత్రి నితీష్ కుమార్,నలంద యూనివర్సిటీ ఛాన్సలర్ అరవింద్ పనగారియా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
వివరాలు
17 దేశాల విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారు
ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భూటాన్, బ్రూనై, దారుస్సలాం, కంబోడియా, చైనా, ఇండోనేషియా, లావోస్, మారిషస్, మయన్మార్, న్యూజిలాండ్, పోర్చుగల్, సింగపూర్, దక్షిణ కొరియా, శ్రీలంక, వియత్నాం సహా మొత్తం 17 దేశాలకు చెందిన విదేశీ ప్రతినిధులు కూడా రానున్నారు. కార్యక్రమానికి హాజరవుతారు.
వివరాలు
క్యాంపస్ రెండు అకడమిక్ బ్లాక్లుగా విభజన
క్యాంపస్ రెండు అకడమిక్ బ్లాక్లుగా విభజించారు. ఒక్కొక్కటి 40 తరగతి గదులు ,మొత్తం సీటింగ్ కెపాసిటీ సుమారు 1900.
ఇందులో రెండు ఆడిటోరియంలు ఉన్నాయి. ఒక్కొక్కటి 300 మంది సీటింగ్ కెపాసిటీతో ఉంటుంది.
ఇది దాదాపు 550 మంది వ్యక్తులతో కూడిన స్టూడెంట్ హాస్టల్ని కలిగి ఉంది.
ఇది అంతర్జాతీయ కేంద్రం, 2000 మంది వరకు కూర్చునే ఆడిటోరియం, ఫ్యాకల్టీ క్లబ్ , స్పోర్ట్స్ కాంప్లెక్స్ వంటి అనేక అదనపు సౌకర్యాలను కూడా కలిగి ఉంది