Page Loader
హత్యకు ముందు 'నిక్కీ యాదవ్' సీసీటీవీ ఫుటేజీని సేకరించిన పోలీసులు- నెట్టింట్లో వైరల్
హత్యకు ముందు 'నిక్కీ యాదవ్' సీసీటీవీ ఫుటేజీని సేకరించిన పోలీసులు

హత్యకు ముందు 'నిక్కీ యాదవ్' సీసీటీవీ ఫుటేజీని సేకరించిన పోలీసులు- నెట్టింట్లో వైరల్

వ్రాసిన వారు Stalin
Feb 15, 2023
07:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలో ప్రియురాలిని హత్య చేసి, మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచి, అదే రోజు ఆ యువకుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో నిందితుడిని సాహిల్ గెహ్లాట్‌గా, మృతురాలిని నిక్కీ యాదవ్‌గా పోలీసులు గుర్తించారు. అయితే తాజాగా హత్యకు ముందు నిక్కీ యాదవ్‌‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు సేకరించారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫిబ్రవరి 9న నిక్కీ తన ఇంట్లోకి ప్రవేశించినట్లు ఆ పుటేజీల్లో కనపడుతోంది. బహుశా ఇదే చివరి పుటేజీ కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

దిల్లీ

2018 నుంచి ఇద్దరి మధ్య పరిచయం

సాహిల్, నిక్కీ 2018 నుంచి ఒకరికొకరు తెలుసు. కరోనా ముందు నుంచి వారు ఇద్దరు దిల్లీలో సహజీవనం చేస్తున్నారు. మహమ్మారి సమయంలో, వారు తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత, వారు ఉత్తమ్ నగర్‌లోని అద్దెకు ఫ్లాట్‌ తీసుకోని సహజీవం సాగిస్తున్నారు. ఈ క్రమంలో సాహిల్‌ మరో మహిళను వివాహం చేసుకోబోతున్నట్లు నిక్కీ తెలుసుకుంది. దీంతో ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్‌షిప్ గురించి తన తల్లిదండ్రులకు చెప్పాలని సాహిల్‌ను నిక్కీ కోరింది. నిక్కీతో పెళ్లికి సాహిల్ సిద్ధంగా లేకపోవడంతో ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో పెళ్లిరోజు ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా ఆవేశంతో అతడు ఆమెను కేబుల్ వైర్‌తో హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు.