NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ప్రియురాలిని హత్య చేసి, మృతదేహాన్ని ప్రిజ్‌లో పెట్టి; అదేరోజు మరో అమ్మాయితో పెళ్లి
    తదుపరి వార్తా కథనం
    ప్రియురాలిని హత్య చేసి, మృతదేహాన్ని ప్రిజ్‌లో పెట్టి; అదేరోజు మరో అమ్మాయితో పెళ్లి
    ప్రియురాలిని హత్య చేసి అదేరోజు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్న యువకుడు

    ప్రియురాలిని హత్య చేసి, మృతదేహాన్ని ప్రిజ్‌లో పెట్టి; అదేరోజు మరో అమ్మాయితో పెళ్లి

    వ్రాసిన వారు Stalin
    Feb 15, 2023
    11:32 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఓ యువకుడు తన ప్రియురాలిని హత్య చేసి, అదే రోజు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఘటన దిల్లీలో మిత్రోన్ గ్రామంలో జరిగింది. ఈ హత్యకు సంబంధించి దిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.

    నిందితుడిని సాహిల్ గెహ్లాట్ (24)గా, మృతురాలిని నిక్కీ యాదవ్‌గా గుర్తించినట్లు పోలీసుల తెలిపారు. కొన్నేళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని, ఈ ఘటన ఫిబ్రవరి 9,10 మధ్య రాత్రి జరిగినట్లు వెల్లడించారు.

    ఆ రోజు రాత్రి తన కారులో మొబైల్ కేబుల్ సహాయంతో నిక్కీ గొంతు నులిమి సాహిల్ హత్య చేసి, మృతదేహాన్ని దిల్లీలోని మిత్రాన్ గ్రామంలో ఉన్న అతని దాబాలోని ఫ్రిజ్‌లో ఉంచాడని పోలీసులు తెలిపారు.

    దిల్లీ

    పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య గొడవ

    ఫిబ్రవరి 10న జరిగిన ఈ సంఘటన గురించి తమకు సమాచారం అందిందని స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవీంద్ర సింగ్ యాదవ్ చెప్పారు. ఆ తర్వాత పరారీలో ఉన్న సాహిల్‌ను దిల్లీలోని కైర్ క్రాసింగ్ వద్ద పట్టుకున్నామని వెల్లడించారు. విచారణలో సాహిల్ నేరాన్ని ఒప్పుకున్నట్లు రవీంద్ర సింగ్ వివరించారు.

    సాహిల్‌ మరో మహిళను వివాహం చేసుకోబోతున్నట్లు బాధితురాలు తెలుసుకుంది. ఈక్రమంలో ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్‌షిప్ గురించి తన తల్లిదండ్రులకు చెప్పాలని సాహిల్‌ను నిక్కీ కోరింది. నిక్కీతో పెళ్లికి సాహిల్ సిద్ధంగా లేకపోవడంతో ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో పెళ్లిరోజు ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా ఆవేశంతో అతడు ఆమెను కేబుల్ వైర్‌తో హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్

    దిల్లీ

    తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఆ తర్వాత ఏం జరిగింది? టాటా
    అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ కాంగ్రెస్
    దిల్లీ ప్రమాదం రిపీట్: నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు ఉత్తర్‌ప్రదేశ్
    ఢిల్లీ ప్రమాదంలో ఆరో అరెస్టు: పోలీసుల అదుపులో అంజలిని ఈడ్చుకెళ్లిన కారు యజమాని రోడ్డు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025