NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనాలు: ఎముకలను కాల్చి, గ్రైండ్ చేసిన ఆఫ్తాబ్
    తదుపరి వార్తా కథనం
    శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనాలు: ఎముకలను కాల్చి, గ్రైండ్ చేసిన ఆఫ్తాబ్
    శ్రద్ధా ఎముకలను కాల్చి, వాటిని గ్రైండ్ చేసినట్లు ఒప్పుకున్న పూనావాలా

    శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనాలు: ఎముకలను కాల్చి, గ్రైండ్ చేసిన ఆఫ్తాబ్

    వ్రాసిన వారు Stalin
    Feb 07, 2023
    06:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్ సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాకర్ హత్య కేసుకు సంబంధించిన మరికొన్ని సంచలన విషయాలు బయటికి వచ్చాయి. దిల్లీ పోలీసులు దాఖలు చేసిన 6,629 పేజీల ఛార్జ్‌షీట్‌లో ఆ విషయాలు ఉన్నాయి.

    ఆఫ్తాబ్ పూనావాలా తన ప్రేయసి శ్రద్ధా వాకర్‌ను హత్య చేసిన తర్వాత ఆమె ముఖం, తలను బ్లోటోర్చ్‌తో ఎవరూ గుర్తు పట్టకుండా వికృతంగా మార్చినట్లు పోలీసులకు వెల్లడించాడు. శ్రద్ధా ఎముకలను కాల్చి, వాటిని గ్రైండ్ చేసినట్లు పేర్కొన్నారు.

    హత్య జరిగిన రోజు రాత్రి, ఆఫ్తాబ్ సమీపంలోని హార్డ్‌వేర్ దుకాణానికి వెళ్లి ఒక రంపపు, మూడు బ్లేడ్‌లు, ఒక సుత్తి, ప్లాస్టిక్ క్లిప్‌లను కొనుగోలు చేసినట్లు పూనావాలా పోలీసులకు చెప్పాడు.

    శ్రద్ధా వాకర్

    విడి భాగాలు కుళ్లిపోకుండా ఉండేందుకు కొత్త ఫ్రిజ్‌లో పెట్టన పూనావాలా

    మృతదేహాన్ని బాత్రూమ్‌కు తీసుకెళ్లి, రంపంతో ఆమె చేతులను కోసి, పాలిథిన్ బ్యాగ్‌లో పెట్టినట్లు, వంటగది దిగువ క్యాబినెట్‌లో సంచులను దాచినట్లు చార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు.

    హత్య చేసిన మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటలకు ఛత్తర్‌పూర్ అటవీ ప్రాంతంలో శ్రద్ధా శరీరం తొడ భాగాన్ని పారవేసానని పోలీసులకు పూనావాలా వివరించాడు. ఆ తర్వాత 4 నుంచి 5 రోజుల్లో శ్రద్ధా శరీరాన్ని ఆఫ్తాబ్ 17ముక్కలుగా కట్ చేసినట్లు ఒప్పుకున్నాడు.

    ఆ తర్వాత ఆమె శరీర భాగాలను ఒక్కొక్కటిగా పారవేసినట్లు, విడి భాగాలు కుళ్లిపోకుండా ఉండేందుకు తాను కొత్తగా కొన్న ఫ్రిజ్‌లో ఉంచినట్లు పోలీసుల ఎదుట పూనావాలా అంగీకరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    దిల్లీ

    తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఆ తర్వాత ఏం జరిగింది? టాటా
    అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ కాంగ్రెస్
    దిల్లీ ప్రమాదం రిపీట్: నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు ఉత్తర్‌ప్రదేశ్
    ఢిల్లీ ప్రమాదంలో ఆరో అరెస్టు: పోలీసుల అదుపులో అంజలిని ఈడ్చుకెళ్లిన కారు యజమాని రోడ్డు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025