NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / శ్రద్ధా హత్య: పూనావాలాపై 6,629 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసిన దిల్లీ పోలీసులు
    తదుపరి వార్తా కథనం
    శ్రద్ధా హత్య: పూనావాలాపై 6,629 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసిన దిల్లీ పోలీసులు
    పూనావాలాపై 6,629 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసిన దిల్లీ పోలీసులు

    శ్రద్ధా హత్య: పూనావాలాపై 6,629 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసిన దిల్లీ పోలీసులు

    వ్రాసిన వారు Stalin
    Jan 25, 2023
    11:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్ సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాకర్ హత్య కేసుకు సంబంధించి 6,629 పేజీల ఛార్జ్‌షీట్ ను దిల్లీ పోలీసులు సాకేత్ కోర్టులో దాఖలు చేశారు. శ్రద్ధా వాకర్‌ను ఆఫ్తాబ్ పూనావాలా ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, పూర్వాపరాలను ఛార్జ్‌షీట్‌లో పోలీసులు వెల్లడించారు.

    పోలీసుల ఛార్జ్‌షీట్ ప్రకారం, శ్రద్ధా వాకర్ తన స్నేహితుడిని కలవడానికి వెళ్లింది. అది పూనావాలాకు నచ్చలేదు. దీంతో గతేడాది మే 18న ఆమె గొంతుకోసి హత్య చేశారు. అంతకు ముందే వీరి మధ్య పెళ్లి గురించి పలు మార్లు వాగ్వాదం జరిగింది. ఈ కేసులో 302, 201 సెక్షన్ల కింద ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఇందుకోసం 150కి పైగా వాంగ్మూలాలు నమోదు చేశారు.

    దిల్లీ

    ఫిబ్రవరి 7 వరకు పూనావాలా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    అమెరికన్ క్రైమ్ సిరీస్ అయిన 'డెక్స్టర్' స్ఫూర్తితోనే శ్రద్ధా శరీరాన్ని 35 ముక్కలుగా చేసినట్లు పూనావాలా పోలీసుల విచారణలో చెప్పారు. శరీరాన్ని ముక్కలు చేయడానికి రంపంతో సహా ఐదు రకాల ఆయుధాలను వాడినట్లు పోలీసులు ఛార్జ్ షీట్‌లో పేర్కొన్నారు.

    2019లో ఆన్‌లైన్ డేటింగ్ యాప్ శ్రద్ధా, పూనావానా పరిచయమయ్యారు. ముంబయిలో ఒకే కాల్ కాల్ సెంటర్‌లో పనిచేయడం ప్రారంభించారు. అదే సమయంలో ప్రేమలో పడ్డారు. మతాలు వేరు కావాడంతో వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఈ జంట తమ నివాసాన్ని గత సంవత్సరం మెహ్రౌలీకి మార్చింది. అక్కడే శ్రద్ధాను పూనావాలా హత్య చేశాడు.

    ఇదిలా ఉంటే, పూనావాలా జ్యుడీషియల్ కస్టడీని ఫిబ్రవరి 7 వరకు సాకేత్ కోర్టు పొడిగించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ

    దిల్లీ

    తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఆ తర్వాత ఏం జరిగింది? టాటా
    అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ కాంగ్రెస్
    దిల్లీ ప్రమాదం రిపీట్: నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు ఉత్తర్‌ప్రదేశ్
    ఢిల్లీ ప్రమాదంలో ఆరో అరెస్టు: పోలీసుల అదుపులో అంజలిని ఈడ్చుకెళ్లిన కారు యజమాని రోడ్డు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025