NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / శ్రద్ధా హత్య: పూనావాలాపై 6,629 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసిన దిల్లీ పోలీసులు
    భారతదేశం

    శ్రద్ధా హత్య: పూనావాలాపై 6,629 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసిన దిల్లీ పోలీసులు

    శ్రద్ధా హత్య: పూనావాలాపై 6,629 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసిన దిల్లీ పోలీసులు
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 25, 2023, 11:56 am 1 నిమి చదవండి
    శ్రద్ధా హత్య: పూనావాలాపై 6,629 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసిన దిల్లీ పోలీసులు
    పూనావాలాపై 6,629 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసిన దిల్లీ పోలీసులు

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్ సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాకర్ హత్య కేసుకు సంబంధించి 6,629 పేజీల ఛార్జ్‌షీట్ ను దిల్లీ పోలీసులు సాకేత్ కోర్టులో దాఖలు చేశారు. శ్రద్ధా వాకర్‌ను ఆఫ్తాబ్ పూనావాలా ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, పూర్వాపరాలను ఛార్జ్‌షీట్‌లో పోలీసులు వెల్లడించారు. పోలీసుల ఛార్జ్‌షీట్ ప్రకారం, శ్రద్ధా వాకర్ తన స్నేహితుడిని కలవడానికి వెళ్లింది. అది పూనావాలాకు నచ్చలేదు. దీంతో గతేడాది మే 18న ఆమె గొంతుకోసి హత్య చేశారు. అంతకు ముందే వీరి మధ్య పెళ్లి గురించి పలు మార్లు వాగ్వాదం జరిగింది. ఈ కేసులో 302, 201 సెక్షన్ల కింద ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఇందుకోసం 150కి పైగా వాంగ్మూలాలు నమోదు చేశారు.

    ఫిబ్రవరి 7 వరకు పూనావాలా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    అమెరికన్ క్రైమ్ సిరీస్ అయిన 'డెక్స్టర్' స్ఫూర్తితోనే శ్రద్ధా శరీరాన్ని 35 ముక్కలుగా చేసినట్లు పూనావాలా పోలీసుల విచారణలో చెప్పారు. శరీరాన్ని ముక్కలు చేయడానికి రంపంతో సహా ఐదు రకాల ఆయుధాలను వాడినట్లు పోలీసులు ఛార్జ్ షీట్‌లో పేర్కొన్నారు. 2019లో ఆన్‌లైన్ డేటింగ్ యాప్ శ్రద్ధా, పూనావానా పరిచయమయ్యారు. ముంబయిలో ఒకే కాల్ కాల్ సెంటర్‌లో పనిచేయడం ప్రారంభించారు. అదే సమయంలో ప్రేమలో పడ్డారు. మతాలు వేరు కావాడంతో వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఈ జంట తమ నివాసాన్ని గత సంవత్సరం మెహ్రౌలీకి మార్చింది. అక్కడే శ్రద్ధాను పూనావాలా హత్య చేశాడు. ఇదిలా ఉంటే, పూనావాలా జ్యుడీషియల్ కస్టడీని ఫిబ్రవరి 7 వరకు సాకేత్ కోర్టు పొడిగించింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    దిల్లీ

    తాజా

    దేశంలో విజృంభిస్తున్న కరోనా; 1,890 కొత్త కేసులు ; 149 రోజుల్లో ఇదే అత్యధికం కోవిడ్
    రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు కాంగ్రెస్
    శ్రీహరికోట: భారతదేశపు అతిపెద్ద ఎల్‌వీఎం రాకెట్‌ను ప్రయోగించిన ఇస్రో ఇస్రో
    మార్చి 26న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్

    దిల్లీ

    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? భూకంపం
    ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు; 44 కేసులు నమోదు, నలుగురి అరెస్టు నరేంద్ర మోదీ
    పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం; 11మంది మృతి; ఉత్తర భారతంలోనూ ప్రకంపనలు భూకంపం
    దిల్లీ మద్యం కేసు: అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత; అధికారులకు లేఖ కల్వకుంట్ల కవిత

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023