Mumbai: ముంబైలో విషాదం.. సూట్కేస్ లో మహిళ మృతదేహం
సెంట్రల్ ముంబైలోని కుర్లాలో సూట్కేస్లో మహిళ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. మెట్రోప్రాజెక్టు పనులు జరుగుతున్న శాంతినగర్లోని సిఎస్టి రోడ్డులో ఎవరో అనుమానిత సూట్కేస్ను వదిలివేయడంతో పోలీసులకు మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో సమాచారం అందిందని అధికారి ఒకరు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సూట్కేస్లో మహిళ మృతదేహాన్ని కనుగొన్నారని అధికారి తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం సివిక్ ఆసుపత్రికి పంపామని, మహిళ గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు. ఆప్రాంతంలో అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కుర్లా పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 (హత్య)కింద కేసు నమోదు చేశారు. ఆమెను చంపిన వారి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నట్లు అధికారి తెలిపారు.