Assembly Elections: పశ్చిమ బెంగాల్, తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్,తమిళనాడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇరు రాష్ట్రాల ప్రజలు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా, తొలి విడతలో 152 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో 7.04 కోట్ల మంది ఓటర్లు ఉన్నప్పటికీ, ఈ దశలో 3,60,77,310 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మిగిలిన 142 స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
వివరాలు
తమిళనాడులో ఓటర్ల సౌకర్యార్థం 75,064 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
ఇక తమిళనాడులో అన్ని 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో మొత్తం 4,023 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా 5.73 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. ఓటర్ల సౌకర్యార్థం 75,064 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇరు రాష్ట్రాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేస్తూ పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మే 4న ప్రకటించనున్నారు.