NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Poonch Attack : జవాన్లపై అమెరికా రైఫిళ్లతో ఉగ్రదాడి.. ఇది వారిపనే 
    తదుపరి వార్తా కథనం
    Poonch Attack : జవాన్లపై అమెరికా రైఫిళ్లతో ఉగ్రదాడి.. ఇది వారిపనే 
    ఇది వారిపనే

    Poonch Attack : జవాన్లపై అమెరికా రైఫిళ్లతో ఉగ్రదాడి.. ఇది వారిపనే 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 22, 2023
    06:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో గురువారం భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు రెండు ఆర్మీ వాహనాలపై మెరుపుదాడి చేశారు.

    దీంతో ఐదుగురు భారత సైనికులు మరణించారు. ఇద్దరు గాయపడ్డట్లు అధికారులు తెలిపారు.

    మధ్యాహ్నం 3:45 గంటలకు ధేరా కీ గలీ, బుఫ్లియాజ్ మధ్య ధాత్యార్ మోర్ వద్ద ఈ దాడి జరిగిందని అధికారులు వివరించారు.

    బ్లైండ్ కర్వ్, ఎగుడుదిగుడుగా ఉన్న రహదారి కారణంగా ఈ సమయంలో ఆర్మీ వాహనాలు వేగాన్ని తగ్గించడంతో పూంచ్ జిల్లాలోని ధాత్యార్ మోర్హ్ ప్రదేశాన్ని ఉగ్రవాదులు దాడి చేయడానికి ఎంచుకున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

    ఉగ్రవాదులు ధేరా కీ గలీ, బుఫ్లియాజ్ మధ్య ధాత్యార్ మోర్ వద్ద ఉన్న కొండపై నుంచి వాహనాలపై బుల్లెట్ల వర్షం కురిపించారు.

    details

    పీఏఎఫ్ఎఫ్ సంస్థదే బాధ్యత అని ప్రకటన

    అయితే ఈ ఆకస్మిక దాడిలో ఉగ్రవాదులు అమెరికా తయారీ రైఫిళ్లు 4 కార్బైన్‌ను ఉపయోగించారు.

    దాడికి పాల్పడిన ఆయుధాలతో ఉగ్రవాదులు సోషల్ మీడియాలో ఫోటోలు విడుదల చేశారు.

    ఈ ఘటనకు పాకిస్తాన్ ఆధారిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాకి చెందిన పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (PAFF) బాధ్యత ప్రకటించింది.

    M4 కార్బైన్, 1980ల్లో అమెరికాలో అభివృద్ధి చేశారు. గ్యాస్ ఆపరేటెడ్, తేలికపాటి మ్యాగజైన్ ఫెడ్ కార్బైన్'ను అమెరికా సాయుధ దళాల ఆయుధంగా పిలుస్తారు.

    ప్రస్తుతం దీన్ని 80కిపైగా దేశాల్లో వినియోస్తున్నారు.ఇదే సమయంలో పలు తీవ్రవాద సంస్థలు సైతం ఈ ఆయుధాన్ని అక్రమంగా వాడుతున్నాయి.

    ఆర్టికల్370 రద్దు తర్వాత లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రసంస్థలు అలజడి సృష్టించేందుకు కుట్రచేస్తున్నాయని అధికారవర్గాలు అంటున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉగ్రవాదులు
    జమ్మూ

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    ఉగ్రవాదులు

    కొన్ని దేశాలు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నాయ్; ఎస్‌సీఓ సదస్సులో పాక్‌కు మోదీ చురక  నరేంద్ర మోదీ
    జెనిన్‌లో ఇజ్రాయెల్ ఆపరేషన్; 12మంది మృతి ఇజ్రాయెల్
    J-K Encounter: జమ్ముకశ్మీర్ పూంచ్‌లో ఎన్‌కౌంటర్; నలుగురు ఉగ్రవాదులు హతం జమ్ముకశ్మీర్
    బెంగళూరు మహానగరంలో భారీ పేలుళ్లకు యత్నం.. ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్ బెంగళూరు

    జమ్మూ

    కేంద్ర కీలక నిర్ణయం.. 14 మొబైల్ యాప్స్ ను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం
    జమ్మూ-శ్రీనగర్ హైవేపై లోయలోకి దూసుకెళ్లిన బస్సు; 10మంది మృతి  రోడ్డు ప్రమాదం
    కశ్మీర్ సరిహద్దులో బెలూన్ కలకలం.. పాకిస్థాన్ పైనే అనుమానం  భారతదేశం
    Ladakh : పాక్ వైపు నుంచి 200 మంది ఉగ్రవాదులు చొరబాటు కోసం వేచి ఉన్నారు: నార్తన్‌ కమాండ్‌ చీఫ్‌ ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025