NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Posani Muralikrishna: వైకాపా నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్‌ మంజూరు 
    తదుపరి వార్తా కథనం
    Posani Muralikrishna: వైకాపా నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్‌ మంజూరు 

    Posani Muralikrishna: వైకాపా నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్‌ మంజూరు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 21, 2025
    05:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వైఎస్సార్సీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి గుంటూరు సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

    చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన పోసాని ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు.

    ఈనెల 23 వరకు రిమాండ్ విధించగా, విచారణలో భాగంగా సీఐడీ అధికారులు ఒకరోజు పాటు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు.

    అనంతరం మళ్లీ కస్టడీకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈలోపే కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

    ఇంతకుముందు కూడా పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మూడుసార్లు అరెస్ట్ అయ్యి, మూడుసార్లు బెయిల్ పొందారు.

    వివరాలు 

    పోసాని విడుదలపై ఉత్కంఠ

    జైలు నుంచి విడుదల అవుతారని భావించిన సమయంలో సీఐడీ అధికారులు పీటీ వారెంట్ నమోదు చేసి, గుంటూరు కోర్టులో హాజరుపరిచారు.

    కోర్టు ఆయనకు ఈనెల 23 వరకు రిమాండ్ విధించడంతో పాటు, ఒకరోజు కస్టడీకి కూడా అనుమతి ఇచ్చింది.

    తాజాగా గుంటూరు సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో, పోసాని విడుదలపై ఉత్కంఠ నెలకొంది.

    ఎందుకంటే రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో నమోదైన కేసుల కారణంగా పోలీసులు మరోసారి పీటీ వారెంట్‌తో అదుపులోకి తీసుకుంటారా? లేకుండా ఆయన నిజంగానే విడుదల అవుతారా? అనే ప్రశ్నపై స్పష్టత రావాల్సి ఉంది.

    రేపు (శనివారం) ఉదయం పోసాని విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వైసీపీ

    తాజా

    China: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలపై చైనా ఆందోళన.. సంయమనం పాటించాలని విజ్ఞప్తి చైనా
    BCCI: ధర్మశాల నుంచి ఢిల్లీకి ఐపీఎల్ జట్లు షిఫ్ట్.. బీసీసీఐ ప్రత్యేక రైలు ఏర్పాటు! బీసీసీఐ
    IPL 2025: భారత్-పాక్ యుద్ధం.. బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ నిరవధికంగా వాయిదా..!   బీసీసీఐ
    Ambala: అంబాలాలో మోగిన యుద్ధ సైరన్లు.. ఇళ్లల్లోకి వెళ్ళిపోమంటూ ఎయిర్ ఫోర్స్ నుంచి హెచ్చరికలు హర్యానా

    వైసీపీ

    Kapu Reservation: కాపుల రిజర్వేషన్‌ హామీని అమలు చేయండి.. సీఎం, డిప్యూటీ సీఎంలకు హరిరామ జోగయ్య లేఖ చంద్రబాబు నాయుడు
    Vijayasai Reddy: రాజకీయాలకు గుడ్‌బై.. రాజ్యసభకు విజయసాయి రెడ్డి రాజీనామా విజయసాయిరెడ్డి
    Sake Sailajanath: నేడు వైసీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్.. పార్టీలోకి ఆహ్వానించనున్న వైఎస్ జగన్  భారతదేశం
    Vizag: వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్‌.. రూ.44.74 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025