NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: వానాకాలం ధాన్యం మిల్లింగ్‌పై పౌరసరఫరాల శాఖ దృష్టి.. ఉగాది నుంచి రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Telangana: వానాకాలం ధాన్యం మిల్లింగ్‌పై పౌరసరఫరాల శాఖ దృష్టి.. ఉగాది నుంచి రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ!
    ఉగాది నుంచి రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ!

    Telangana: వానాకాలం ధాన్యం మిల్లింగ్‌పై పౌరసరఫరాల శాఖ దృష్టి.. ఉగాది నుంచి రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 14, 2025
    01:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వానాకాలంలో ధాన్యం సేకరణ పూర్తయిన తరువాత, పౌర సరఫరాల శాఖ దాని మిల్లింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించింది.

    ఇప్పటివరకు రేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యం పంపిణీ జరుగుతుండగా, త్వరలోనే ఆ స్థానంలో సన్నబియ్యం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

    ఈ నేపథ్యంలో, ధాన్యం సేకరణ ప్రారంభమైనప్పటి నుంచే సన్న, దొడ్డు వడ్లను వేర్వేరుగా నిల్వ చేసి, మిల్లులకు తరలించడం, ఆపై కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సిద్ధం చేయడం జరుగుతోంది.

    ఫిబ్రవరి తొలి వారానికి 4.59 లక్షల టన్నుల సన్నబియ్యం అందుబాటులోకి వచ్చినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు.

    వివరాలు 

    నెలకు 2.30 లక్షల టన్నుల అవసరం 

    రేషన్‌కార్డుదారులకు ఉగాది పండగ సందర్భంగా సన్నబియ్యం పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.

    ఇప్పటికే పాఠశాలల మధ్యాహ్న భోజన పథకం, సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థుల కోసం సన్నబియ్యం ఉపయోగిస్తున్నారు.

    రేషన్‌కార్డుదారులు, విద్యార్థుల కోసం కలిపి నెలకు 2.30 లక్షల టన్నుల సన్నబియ్యం అవసరమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

    ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4.59 లక్షల టన్నులు రెండు నెలల సరిపోతాయని పేర్కొన్నారు.

    ఇంకా పెద్ద ఎత్తున సన్న వడ్ల మిల్లింగ్ కొనసాగుతోంది. యాసంగి వడ్ల సేకరణ ఏప్రిల్ నుండి ప్రారంభంకానుంది.

    అప్పటివరకు వానాకాలంలో సేకరించిన సన్న ధాన్యాన్ని సీఎంఆర్ రూపంలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

    వివరాలు 

    24 లక్షల టన్నుల ధాన్యం సేకరణ 

    వానాకాలం పంటలో 4,48,939 మంది రైతుల నుండి పౌర సరఫరాల శాఖ 24లక్షల టన్నుల సన్న వడ్లను సేకరించింది.

    సాధారణంగా 100టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేసినప్పుడు సుమారు 67టన్నుల సన్నబియ్యం వస్తుంది.

    ఈ లెక్కన,మొత్తం 24 లక్షల టన్నుల వడ్ల నుండి 16.08 లక్షల టన్నుల బియ్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

    రాష్ట్రవ్యాప్తంగా 89.98 లక్షల రేషన్ కార్డులు ఉండగా, మొత్తం 2.81 కోట్ల మంది లబ్ధిదారులున్నారు.

    ప్రతి ఒక్కరికీ నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం సరఫరా చేయనున్నారు.

    ప్రస్తుతం పంపిణీ చేస్తున్న దొడ్డు బియ్యాన్ని చాలా మంది నేరుగా అన్నం వండడానికి ఉపయోగించకుండా రీసైక్లింగ్‌కు తరలిస్తున్నారని గుర్తించిన ప్రభుత్వం, ఈ అక్రమాలను అరికట్టేందుకు రేషన్‌లో సన్నబియ్యం అందించాలని నిర్ణయించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌

    తెలంగాణ

    MLC Elections: ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల ఎన్నికల సంఘం
    Tenth Students: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్  భారతదేశం
    Osmania Hospital: నేడు ఉస్మానియా ఆసుపత్రికి సీఎం భూమిపూజ.. నూతన ఆసుపత్రి విశేషాలు ఇవే.. భారతదేశం
    Heatwave: ఇప్పుడే ఉక్కపోత మొదలైంది.. రాబోయే రోజుల్లో మరింత తీవ్రత! ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025