
Droupadi Murmu: అంధ విద్యార్థులు గీతాలాపనతో పుట్టినరోజు శుభాకాంక్షలు.. కంటతడి పెట్టిన రాష్ట్రపతి
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అసలు ఘటనకు వస్తే... శుక్రవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా మూడు రోజుల పర్యటనలో భాగంగా దెహ్రాదూన్కి వెళ్లారు.
ఈ సందర్భంగా అక్కడి అంధుల పాఠశాలలో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అనేకమంది అంధ విద్యార్థులు గీతాలు ఆలపించి రాష్ట్రపతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
వివరాలు
భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టిన రాష్ట్రపతి ముర్ము
విద్యార్థుల ప్రేమతో పాడిన పాటను విన్న రాష్ట్రపతి ముర్ము భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు.
అనంతరం ఆమె ప్రసంగిస్తూ... తన ప్రజా జీవితంలో మరిచిపోలేని, ఎంతో హృదయాన్ని తాకిన క్షణాల్లో ఇది ఒకటిగా పేర్కొన్నారు.
అప్రయత్నంగా వచ్చే పిల్లల స్వచ్ఛమైన స్వరాలు, వారి ధైర్యం, వారి స్పూర్తి భారతదేశ అసలైన ఆత్మను ప్రతిబింబిస్తాయంటూ హర్షాన్ని వ్యక్తం చేశారు.
దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న అంధుల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమం
Dehradun | A Heartwarming Moment❤️
— Mamta Painuly Kale (@mamta_kale) June 20, 2025
President Droupadi Murmu Ji was visibly moved to tears as students from the National Institute for the Empowerment of Persons with Visual Disabilities touched hearts by singing a soulful birthday tribute. Their voices, full of warmth and… pic.twitter.com/qgXxpmDImT