NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: గుల్జార్‌హౌస్‌ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
    తదుపరి వార్తా కథనం
    PM Modi: గుల్జార్‌హౌస్‌ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
    గుల్జార్‌హౌస్‌ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

    PM Modi: గుల్జార్‌హౌస్‌ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 18, 2025
    12:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్‌లోని చార్మినార్ పరిధిలో గల గుల్జార్‌హౌస్‌లో ఆదివారం ఉదయం జరిగిన ఘోర అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా కలచివేసింది.

    ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

    మంటల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలపై తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

    ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తరఫున రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.

    అలాగే క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం అందజేస్తామని మోదీ తెలిపారు.

    దుర్ఘటనలో మొత్తం 16 మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలున్నారు.

    Details

    మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన చంద్రబాబు నాయుడు

    ఆదివారం ఉదయం గుల్జార్‌హౌస్‌లోని ఓ భవనపు మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భవనం మొత్తాన్ని మంటలు చుట్టేసాయి.

    అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. మంటల్లో చిక్కుకున్న వారిలో కొందరిని రక్షించి ఉస్మానియా, యశోద (మలక్‌పేట), డీఆర్డీవో అపోలో ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదానికి విద్యుదాఘాతమే కారణమని ప్రాథమిక సమాచారం వెల్లడించింది.

    ఇక ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

    క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    హైదరాబాద్
    చంద్రబాబు నాయుడు

    తాజా

    PM Modi: గుల్జార్‌హౌస్‌ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి నరేంద్ర మోదీ
    Telangana: తెలంగాణ కేబినెట్ విస్తరణకు సమయమొచ్చిందా..? ఆరుగురికి గ్రీన్ సిగ్నల్!  తెలంగాణ
    Citroen C3 CNG: పర్యావరణహిత వాహనాల్లో మరో అడుగు.. సిట్రోయెన్ C3 CNG వెర్షన్ ఆవిష్కరణ! ఆటో మొబైల్
    Vitamin D: పిల్లల నుంచి పెద్దల వరకూ... అందరికీ అవసరం 'డి విటమిన్‌'  జీవనశైలి

    నరేంద్ర మోదీ

    Indus Water Treaty: పాకిస్థాన్ తో చేసుకున్న 'సింధు జలాల ఒప్పందం'రద్దు.. అసలు ఈ ఒప్పందం ఏమిటి?  భారతదేశం
    PM Modi: 'భారతదేశం ప్రతి ఉగ్రవాదిని గుర్తించి, కనిపెట్టి, శిక్షిస్తుంది'.. పహల్గాం ఘటనపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ భారతదేశం
    Seema Haider: 'నేను భారత్‌కు కోడలిని'.. పీఎం మోదీ, సీఎం యోగిలకు సీమా హైదర్‌ విజ్ఞప్తి! భారతదేశం
    PM Modi: పహల్గాం ఉగ్రదాడి.. బాధితులకు న్యాయం చేస్తాం : నరేంద్ర మోదీ భారతదేశం

    హైదరాబాద్

    Hyderabad: అగ్ని ప్రమాదాలు,వరద ముంపు నివారణపై.. జీహెచ్‌ఎంసీ, హైడ్రా ప్రత్యేక దృష్టి భారతదేశం
    Betting Gang : ఫేక్ కంపెనీల పేరిట బెట్టింగ్ ముఠా.. హైదరాబాద్‌లో భార్యభర్తల అరెస్టు క్రికెట్
    Hyderabad: హైదరాబాద్‌లో భారీగా పడిపోయిన తేమ శాతం.. రాష్ట్రవ్యాప్తంగా నేడు అధిక ఉష్ణోగ్రతలు భారతదేశం
    Hyderabad: హైదరాబాద్‌లో గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్‌ ఏర్పాటు.. సీఎం రేవంత్‌ను కలిసిన వ్యాన్‌గార్డ్‌ సీఈవో భారతదేశం

    చంద్రబాబు నాయుడు

    Amaravati: అమరావతిలో మూడేళ్ల తర్వాత నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్.. రూ.40వేల కోట్లకు ఆమోదం అమరావతి
    Chandrababu: అదే జరిగితే.. 75 మంది మహిళలు అసెంబ్లీకి: చంద్రబాబు భారతదేశం
    CM Chandrababu: 47 ఏళ్ల క్రితం ఇదే రోజు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం: సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్
    CM Chandrababu: రాజధానిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం.. స్మారక పార్క్ ఏర్పాటు  అమరావతి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025