PM Modi speech ayodhya: అయోధ్యకు మన రాముడు తిరిగొచ్చాడు: ప్రధాని మోదీ
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేసారు. అయోధ్యకు శతాబ్దాల నిరీక్షణ తర్వాత మన రాముడు తిరిగొచ్చినట్లు మోదీ పేర్కొన్నారు. త్రేతాయుగంలో శ్రీరాముడు దాదాపు 14ఏళ్లు వనవాసానికి వెళ్లాడని, కానీ కలియుగంలో వందలయేళ్లపాటు వనవాసం చేసినట్లు మోదీ చెప్పారు. ఇక రామ్ లల్లా టెంట్ కింద ఉండరని, గర్భగుడిలో ఉంటారని మోదీ వెల్లడించారు. ఎన్నో బలిదానాల అనంతరం మన రాముడు అయోధ్యకు తిరొచ్చినట్లు చెప్పారు. ఈ శుభ సందర్భంలో దేశ ప్రజలందరికీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. రామాలయ ప్రారంభోత్సం వేళ.. భక్తులంతా భక్తి పరవశంలో ఉన్నట్లు మోదీ పేర్కొన్నారు. 2024జనవరి 22వ తేదీ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ రోజు నవ యుగానికి ప్రతీక అని మోదీ అన్నారు.
శ్రీరాముడు భారతదేశ ఆత్మ: మోదీ
అయోధ్యలో ఆలయం నిర్మించడం ఆలస్యమైనందుకు శ్రీరాముడికి క్షమాపణలు చెబుతున్నట్లు మోదీ వివరించారు. ఈ క్షణం చాలా ప్రత్యేకమైనదిగా మోదీ పేర్కొన్నారు. ఇది సామాన్యమైన సమయం కాదన్నారు. శ్రీరాముడు భారతదేశ ఆత్మగా మోదీ అభివర్ణించారు. రామాయలం ప్రారంభోత్సం సందర్భంగా తనకు ఎంతో చెప్పాలని ఉందని, కానీ తన గొంతు గద్గదంగా ఉందని మోదీ పేర్కొన్నారు. తన శరీరం ప్రస్తుతం అలౌకిక ఆనందంలో ఉందన్నారు. గర్భగుడిలో బాలరాముడిని తన చేతులు మీదుగా ప్రతిష్ఠంచడం అదృష్టంగా భావిస్తున్నట్లు వివరించారు. రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా భారత న్యాయవ్యవస్థకు ఈ సందర్భంగా తాను నమస్కరిస్తున్నట్లు మోదీ చెప్పారు.