NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటనలో రాజకీయ కోణం? ‌అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమా?
    తదుపరి వార్తా కథనం
    ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటనలో రాజకీయ కోణం? ‌అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమా?
    దేవ్‌నారాయణ్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు రాజస్థాన్‌కు ప్రధాని మోదీ

    ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటనలో రాజకీయ కోణం? ‌అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమా?

    వ్రాసిన వారు Stalin
    Jan 28, 2023
    11:12 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తొమ్మిది రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా రాజస్థాన్‌‌పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని బీజేపీ భావిస్తోంది. అందుకే మోదీ కూడా రాజస్థాన్‌పై శ్రద్ధ కనబరుస్తున్నారు.

    రిపబ్లిక్ డే నాడు రాజస్థాన్ తలపాగా ధరించి ఆ రాష్ట్ర ప్రజలను సర్‌ప్రైజ్ చేసిన మోదీ, శనివారం రాజస్థాన్ పర్యటనకు వెళ్లారు. భిల్వారా జిల్లాలో గుర్జార్ గిరిజన సామాజిక వర్గ ఆరాధ్య దైవం దేవ్‌నారాయణ్ జయంతి వేడుకల్లో మోదీ పాల్గొంటారు.

    గుర్జార్ గిరిజన సామాజిక వర్గం దేవ్‌నారాయణ్‌ని మహావిష్ణువు అవతారంగా భావిస్తుంటారు. అందుకే ప్రతి ఏటా ఆయన జన్మించిన మలసేరి దుంగ్రి గ్రామంలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.

    రాజస్థాన్

    గుర్జార్‌ సామాజిక వర్గాన్ని ఆకర్షించడానికేనా?

    ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటనలో ఎలాంటి రాజకీయ కోణం లేదని బీజేపీ చెబుతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ పర్యటన బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తుందని విశేషకులు భావిస్తున్నారు.

    తూర్పు రాజస్థాన్‌లోని మెజార్టీ అసెంబ్లీ స్థానాల్లో గుర్జార్ వర్గం గెలుపోటములను శాసిస్తుంది. గుర్జార్‌ సామాజిక వర్గానికి చెందిన సచిన్ పైలట్‌ను ముఖ్యమంత్రిగా చేయనందున ఆ వర్గం కాంగ్రెస్ పట్ల నిరాశతో ఉన్నారని బీజేపీ భావిస్తోంది. గుర్జార్ వర్గం ఆరాధ్య దైవం దేవ్‌నారాయణ్‌ జయంతికి ప్రధాని మోదీ రావడం వల్ల ఆ సామాజిక వర్గం బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం ఉంటుందని కమల దళం ఆశిస్తోంది.

    దేవనారాయణ్ జయంతి సందర్భంగా ఆలయంలో ప్రధాని ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కను నాటనున్నారు. అనంతరం సభలో కూడా ప్రసంగిస్తారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్
    ప్రధాన మంత్రి
    నరేంద్ర మోదీ
    అసెంబ్లీ ఎన్నికలు

    తాజా

    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ
    Donald Trump: 'ఆపిల్‌'కు ట్రంప్‌ వార్నింగ్‌.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే! డొనాల్డ్ ట్రంప్

    రాజస్థాన్

    భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్ భారతదేశం

    ప్రధాన మంత్రి

    ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్.. 'శాంతిలో పాలుపంచుకోండి' ఉక్రెయిన్
    ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ నరేంద్ర మోదీ
    కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా? చంద్రబాబు నాయుడు
    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    నరేంద్ర మోదీ

    మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత.. మాతృమూర్తిపై ప్రధాని భావోధ్వేగ ట్వీట్ గుజరాత్
    టార్గెట్ 2024: కేంద్ర మంత్రివర్గం, బీజేపీలో భారీ మార్పులకు మోదీ స్కెచ్ భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    బడ్జెట్ టారిఫ్ తో రఘురాం రాజన్ ను భయపెడుతున్న మోడీ ప్రభుత్వం ఆర్ బి ఐ
    పెద్ద నోట్ల రద్దు.. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు సుప్రీంకోర్టు

    అసెంబ్లీ ఎన్నికలు

    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ అమిత్ షా
    కర్ణాటక: అసెంబ్లీ ఎన్నికల వేళ.. రథయాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ కర్ణాటక
    2024 ఎన్నికల వరకు బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడగింపు జేపీ నడ్డా
    Election Commission: నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూల్‌ విడుదల త్రిపుర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025