LOADING...
PM Modi: ప్రైవేటు రాకెట్ విప్లవం.. సైకిల్‌ నుంచి రాకెట్‌ వరకు.. భారత అంతరిక్ష విజయాల ప్రస్థానమిది : మోదీ
ప్రైవేటు రాకెట్ విప్లవం.. సైకిల్‌ నుంచి రాకెట్‌ వరకు.. భారత అంతరిక్ష విజయాల ప్రస్థానమిది : మోదీ

PM Modi: ప్రైవేటు రాకెట్ విప్లవం.. సైకిల్‌ నుంచి రాకెట్‌ వరకు.. భారత అంతరిక్ష విజయాల ప్రస్థానమిది : మోదీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2025
12:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

శంషాబాద్‌లోని స్కైరూట్‌ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ తొలి ప్రైవేటు కమర్షియల్ రాకెట్‌ 'విక్రమ్‌-1'ను ఆవిష్కరించింది. స్కైరూట్‌ ఇన్ఫినిటీ క్యాంపస్‌ దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు రాకెట్‌ ఫ్యాక్టరీగా నిలిచింది. ప్రధాని మోదీ స్కైరూట్‌ బృందానికి అభినందనలు తెలియజేస్తూ, ఇది అంతరిక్ష రంగంలో ఒక గొప్ప మైలురాయిగా గుర్తింపు పొందుతోందని చెప్పారు. భారత యువశక్తి నైపుణ్యానికి స్కైరూట్‌ ప్రతీకగా ఉందని, భవిష్యత్తులో భారత అంతరిక్ష రంగం మరిన్ని ఘనతలు సాధిస్తుందని ఆయన చెప్పారు. ఈ విజయం భారత యువశక్తికి స్ఫూర్తినిస్తుంది.

Details

మరింత విజ్ఞానం సాధించాలి

మన ప్రస్థానం సైకిల్‌పై రాకెట్‌ మోసుకెళ్లే స్థితి నుంచి మొదలైంది. వ్యవసాయం, వాతావరణ అంచనాల్లో మరింత విజ్ఞానం సాధించాలి. స్పేస్‌ సెక్టార్‌లో కో-ఆపరేటివ్‌, ఎకో సిస్టమ్‌ను ఏర్పాటు చేశాం. జన్‌జీ అనుకున్నది సాధించేలా ప్రభుత్వం సహకరిస్తుంది. కేంద్రం ఇచ్చే మద్దతు వల్లే స్టార్టప్‌లు ఏర్పడుతున్నాయి. ప్రైవేటు రంగంలోనూ అంతరిక్ష సంస్థలు పుట్టుకొస్తున్నాయి. జన్‌జీ ఇంజినీర్లు, డిజైనర్లు, కోడర్స్‌, సైంటిస్టులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని మోదీ తెలిపారు. ఈ ఘటనా భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగ అభివృద్ధికి కొత్త దిశను చూపుతూ, యువ ఇంజినీర్లకు గొప్ప అవకాశాలను సృష్టించిందని స్పష్టమైంది.