Page Loader
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు; క్లారిటీ ఇచ్చిన కేంద్రం 
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు; క్లారిటీ ఇచ్చిన కేంద్రం

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు; క్లారిటీ ఇచ్చిన కేంద్రం 

వ్రాసిన వారు Stalin
Apr 14, 2023
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌గా పిలిచే రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగదని శుక్రవారం కేంద్రం స్పష్టం చేసింది. వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణపై కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌సింగ్‌ కులస్తే విరుద్ధమైన ప్రకటనలు చేసిన మరుసటి రోజే కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆర్‌ఐఎన్‌ఎల్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పురోగతిలో ఉందని, సంస్థ పనితీరును మెరుగుపరచడానికి ప్రైవేటీకరణ తప్పదని ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. పెట్టుబడుల ఉహసంహరణకు కంపెనీ ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రభుత్వం కూడా దానికి అండగా నిలుస్తుందని పేర్కొంది.

విశాఖ

రాజకీయ వివాదంగా మారిన విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ వ్యవహారం

విశాఖపట్టణం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రక్రియపై ఫగ్గన్‌సింగ్‌ కులస్తే చేసిన ప్రకటన తర్వాత సందిగ్ధత ఏర్పడింది. అలాగే ఇది రాజకీయ వివాదంగా కూడా మారింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య వాగ్వాదానికి కూడా దారి తీసీంది. ఈ అంశంపై తెలంగాణ మంత్రి హరిష్ రావు, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే పేర్ని నాని మధ్య వాగ్ధాటి నడిచింది. అయితే అయోమయానికి మీడియా నివేదికలే కారణమని కేంద్రం తన ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. ఈ క్రమంలో ఫగ్గన్‌సింగ్‌ కులస్తే మాట్లాడిన మాటల గురించి కేంద్రం ప్రస్తావించలేదు.