NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / YSR Family Assets : జగన్, షర్మిల మధ్య ఆస్తి గొడవ.. NCLTలో జగన్ పిటిషన్
    తదుపరి వార్తా కథనం
    YSR Family Assets : జగన్, షర్మిల మధ్య ఆస్తి గొడవ.. NCLTలో జగన్ పిటిషన్
    జగన్, షర్మిల మధ్య ఆస్తి గొడవ.. NCLTలో జగన్ పిటిషన్

    YSR Family Assets : జగన్, షర్మిల మధ్య ఆస్తి గొడవ.. NCLTలో జగన్ పిటిషన్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 23, 2024
    12:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గత కొంతకాలంగా వైఎస్ కుటుంబంలో విభేదాలు తీవ్రంగా మారుతున్న సంగతి తెలిసిందే.

    అందులో ముఖ్యంగా సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడం, ఆమె సోదరుడు వైఎస్ జగన్‌పై రాజకీయ విమర్శలు చేసేది చర్చనీయాంశంగా మారాయి.

    ఎన్నికల సమయంలో ఆస్తి పంపకాలపై పరోక్ష వ్యాఖ్యలు చేయడం వంటి అంశాలు ఇప్పటికే సంచలనాలను సృష్టించాయి.

    ఇటీవల మరో వివాదం పలు పత్రికల్లో హల్‌చల్ చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సోదరి వైఎస్ షర్మిల, తల్లి విజయమ్మపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)లో పిటిషన్ దాఖలు చేశారు.

    Details

    ప్రతివాదులుగా వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ

    సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో వాటాల కేటాయింపుపై వివాదం నెలకొంది. దీంతో జగన్ ఈ చర్యకు నిర్ణయించుకున్నారు.

    సెప్టెంబర్ 10న ఎన్‌సిఎల్‌టీలో నమోదైన ఈ కేసు కంపెనీ చట్టంలోని సెక్షన్ 59 కింద దాఖలు చేశారు.

    ఈ కేసులో ఇతర ప్రతివాదులుగా వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, చగరి జనార్థన్ రెడ్డి, యశ్వనాథ్ రెడ్డి, రీజినల్ డైరెక్టర్ సౌత్ ఈస్ట్ రీజియన్, రిజిస్ట్రర్ ఆఫ్ కంపెన్స్ తెలంగాణ పేర్లు చేర్చారు.

    సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్‌లో తమ పాత్ర కీలకమని జగన్ తన పిటిషన్‌లో వివరించారు.

    Details

    ప్రతివాదులకు నోటీసులు జారీ

    2019 ఆగస్టు 21న షర్మిలకు వాటాలు కేటాయించేందుకు అవగాహన ఒప్పందంపై సంతకం చేశామన్నారు.

    అయితే వాటా కేటాయింపు ఇంకా ఖరారుకాకపోవడం, ఇఖ షర్మిలతో జరిగిన రాజకీయ విభేదాలు కారణంగా ఈ వివాదం ఉద్భవించిందని పిటిషన్‌లో వెల్లడించారు.

    ఎన్‌సీఎల్‌టీ ఈ పిటిషన్‌ను స్వీకరించి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 2024 నవంబర్ 8కి షెడ్యూల్ చేశారు.

    ఈ కేసు దాఖలు కావడంతో సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్‌తో పాటు వైఎస్ కుటుంబంలోని విబేధాలకు మరింత బలం చేకూర్చాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    వైఎస్ షర్మిల

    తాజా

    Tesla: టెస్లా కేవలం షోరూమ్‌ల స్థాపనపై మాత్రమే దృష్టి: కేంద్ర మంత్రి టెస్లా
    AI in 2030: ఏఐ రాక‌తో 2030 నాటికి కొలువులు క‌నుమ‌రుగు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    stock market: స్వల్పనష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు  స్టాక్ మార్కెట్
    Kamal Haasan: 'థగ్ లైఫ్‌' విడుదల కోసం హైకోర్టును ఆశ్రయించిన కమల్‌ హాసన్‌! కమల్ హాసన్

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    పరిపాలన రాజధానిపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. అక్టోబర్‌ నుంచి విశాఖలో పాలన విశాఖపట్టణం
    Bandi Sanjay: దొంగ ఓట్లతో గెలిచేందుకు వైఎస్ జగన్ కుట్ర- బండి సంజయ్ ఆరోపణలు  బండి సంజయ్
    విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి  వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ
    కోడికత్తిని అందించింది మంత్రి బొత్స మేనల్లుడే: న్యాయవాది సలీం సంచలన వ్యాఖ్యలు  బొత్స సత్యనారాయణ

    వైఎస్ షర్మిల

    రాజకీయాల్లోకి వైఎస్ భారతి; జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ బరిలో? జమ్మలమడుగు
    లోటస్ పాండ్ వద్ద హై టెన్షన్; మహిళా కానిస్టేబుల్‌ను చెంపదెబ్బ కొట్టిన షర్మిల హైదరాబాద్
    కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల రావడాన్ని ఆహ్వానిస్తున్నాం : మాజీ ఎంపీ కేవీపీ కాంగ్రెస్
    సీఎం జగన్‌తో తెలంగాణ మాజీ ఎంపీ పొంగులేటీ భేటీ వై.ఎస్.జగన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025