NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Punjab Bandh: ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు.. నేడు పంజాబ్ బంద్‌కు పిలుపునిచ్చిన రైతులు..
    తదుపరి వార్తా కథనం
    Punjab Bandh: ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు.. నేడు పంజాబ్ బంద్‌కు పిలుపునిచ్చిన రైతులు..
    నేడు పంజాబ్ బంద్‌కు పిలుపునిచ్చిన రైతులు..

    Punjab Bandh: ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు.. నేడు పంజాబ్ బంద్‌కు పిలుపునిచ్చిన రైతులు..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 30, 2024
    09:12 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు.

    ఖనౌరీ సరిహద్దులో గత 34 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్‌కు మద్దతుగా పంజాబ్ రైతులు డిసెంబర్ 30న పంజాబ్ బంద్‌కు పిలుపునిచ్చారు.

    ఈ బంద్ ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు కొనసాగుతుందని, అందుకు ప్రజలు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

    ఈ సమయంలో రాష్ట్రంలో పాలు, కూరగాయలు వంటి నిత్యవసర వస్తువుల సరఫరాను నిలిపివేస్తామని, రహదారులపై వాహనాలు మరియు రైళ్లను కూడా ఆపివేస్తామని స్పష్టంచేశారు.

    రైతుల ఈ బంద్‌కు వాణిజ్య సంస్థలు కూడా మద్దతు ప్రకటించాయి.

    వివరాలు 

    వ్యాపారులు, ఉద్యోగ సంఘాలు, కార్మికులు, వివిధ వర్గాల నుండి మద్దతు

    ఇక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కూడా బంద్‌కు మద్దతుగా మూసివేయాలని రైతు సంఘాల నాయకులు కోరారు.

    అయితే, అంబులెన్స్‌లు, పెళ్లి వాహనాలు, అత్యవసర పరిస్థితుల్లో రాకపోకల వారికి మాత్రం అనుమతి ఉంటుందని తెలిపారు.

    ఈ బంద్‌కు సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్) కిసాన్ మజ్దూర్ మోర్చా గత వారం నిర్ణయం తీసుకున్నాయి.

    దీనికి వ్యాపారులు, ఉద్యోగ సంఘాలు, కార్మికులు, వివిధ వర్గాల నుండి మద్దతు లభించిందని ప్రకటించారు.

    వివరాలు 

    మహాపంచాయత్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన

    రైతులు తమ పంటలకు కనీస మద్దతు ధరలు అందించాలని డిమాండ్ చేస్తూ, 101 మంది రైతులు పంజాబ్-ఢిల్లీ సరిహద్దుల్లో శంభు సరిహద్దు వద్ద గత కొన్ని నెలలుగా ఆందోళన కొనసాగిస్తున్నారు.

    ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేయడానికి వారు పలుమార్లు ప్రయత్నించారు, కానీ భద్రతా దళాలు ఆ ప్రయత్నాలను అడ్డుకున్నాయి.

    ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి 4న ఖనౌరీ నిరసన ప్రదేశంలో కిసాన్ మహాపంచాయత్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన చేపట్టాలని రైతులు నిర్ణయించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పంజాబ్

    తాజా

    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్
    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్
    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా

    పంజాబ్

    Punjab: పంజాబ్‌లో అకాలీదళ్, బీజేపీ పొత్తు చర్చలు విఫలం  బీజేపీ
    Farmers Protest: రైతుల నిరసన.. దిల్లీ సరిహద్దుల్లో భారీగా భద్రత.. ఆంక్షల విధింపు  దిల్లీ
    Delhi Chalo march: రైతుల ఆందోళన.. దిల్లీ సరిహద్దులో టియర్ గ్యాస్ ప్రయోగం దిల్లీ
    Punjab Farmers: 6నెలలకు సరిపోయే రేషన్, డీజిల్‌తో సరిహద్దుకు పంజాబ్ రైతులు దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025